DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని బాబు అండ్ కో దోచుకున్నారు. అన్నింటా అవినీతే  : బీజేపీ MLC సోము వీర్రాజు 

అవినీతీ బయటకు రాకూడని ఉత్తుత్తి ధర్నాలు చేస్తున్నారు. 

విశాఖపట్నం, జూన్ 20 , 2018 (DNS Online ): గత నాలుగేళ్ల కాలం లో ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రాన్ని గుంపగుత్తగా ఈ రాష్ట్ర

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు గుంపగుత్తగా దోచుకున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎం ఎల్ సి సోము వీర్రాజు మండిపడ్డారు.

బుధవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్రం లో విద్య వ్యవస్థను పూర్తి గా బ్రష్టు పట్టించారని, చంద్రబాబు 2016 వరకూ

పోలవరం నిర్మాణాన్ని ఎందుకు ప్రారంభించలేదు? పట్టిసీమ ఎత్తిపోతల పధకం ఎందుకు కట్టారని ప్రశ్నించారు.  à°µà°¿à°¦à±à°¯ నుంచీ నీరు చెట్టు వరకూ ప్రతి పధకంలో అవినీతే. ఒక్క

గృహనిర్మాణ పధకంలోనే 30 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఏపీలో కనీ వినీ ఎరుగని అవినీతి జరుగుతోంది. దాన్ని మేము అంగీకరించనందునే ఎన్డీఏ నుంచి బయటకు

వెళ్లిపోయారని తెలిపారు. బీజేపీ అవినీతిని సహించదని హెచ్చరించారు. తమ అవినీతి బయట పడకుండా హోదా, జోను, మతతత్వం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కోట్లాది రూపాయలు

ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఉత్తుత్తి ధర్నాలు, చేసి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారని, ప్రజా ధనం కొల్లగొడుతున్నారన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేకుంటే

చంద్రబాబు జీరో అని బీజేపీ నేత అన్నారు. 

రాజ్యసభలో నాటి à°Žà°‚ పీ  à°µà±†à°‚కయ్యనాయుడు పోలవరం ముంపు మండలాల గురించి మాట్లాడుతుంటే సీఎం రమేష్‌ అడ్డుపడిన విషయాన్ని

గుర్తు చేశారు. విభజన హామీల గురించి పోరాడని పార్టీలు నేడు నోటికి వచ్చిన విమర్శలు చేస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాలకి సమ న్యాయం చెయ్యమని కేవలం ప్లకార్డులు

మాత్రం పట్టుకున్న తెలుగుదేశం ఎంపీలు, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా కు ఏమి కావాలో కనీసం నోరు విప్పలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రాకి ఈ మాత్రం హామీలైనా నెరవేరతాయి

అంటే అది కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు.  à°ªà±‹à°²à°µà°°à°‚, రైల్వేజోన్‌, à°•à°¡à°ª ఉక్కు పరిశ్రమ హామీలను 2019 కంటే ముందే అమలు చేస్తామని

తెలిపారు. 

నిరుద్యోగులకు భృతి లేదు. తాత్కాలిక ఉద్యోగులకు జీతాల పెరుగుదల లేదు. కాంట్రాక్టు ఉద్యోగికి ఆరువేల  à°œà±€à°¤à°‚ పెరగదు. కానీ ముఖ్యమంత్రి తాగే మంచి

నీటి బాటిల్ à°•à°¿ ఆరొందల రూపాయల ఖర్చు పెడతారన్నారు. 

విమ్స్ కి నిధుల్లేవు, అమరావతి లో అన్నీనూ...

విశాఖ నగరం లో లో విమ్స్ ఆస్పత్రికి కనీసం నిధులివ్వరు

కానీ అమరావతికి అన్ని ప్రభుత్వ, ప్రయివేట్  à°®à±†à°¡à°¿à°•à°²à± కాలేజీలూ తరలించేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారానికి వచ్చిన నాయీ బ్రాహ్మణుల మీద ఆయన భాష ఏమిటి అన్నారు. పైగా

ఇతని వైఖరికి తెలుగుదేశం క్యాడర్ సోషల్ మీడియా లో మద్దతులు, ఇతరులకు హెచ్చరికలు కూడా జారీచేస్తున్నారన్నారు. 

హుద్ హుద్ తో ప్రకృతి ప్రకోపానికి బలైన విశాఖ

నగరానికి సహాయంగా చేరిన ప్రతీ రూపాయి కేంద్రం విడుదల చేసిందేనన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ కార్మికులను వేలాదిగా విశాఖ జిల్లాకు తరలించిన కేంద్రం

కేవలం మూడు రోజుల్లో విద్యుత్ ను సంపూర్ణాంగా అందించగలిగిందన్నారు. ఇది పూర్తిగా మోడీ ఘనతే అన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam