DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా రాజధానిగా విశాఖ వైపే బోస్టన్ కన్సల్టెన్సీ చూపు, 

పోర్టు, ఎయిర్ పోర్ట్ ల తో అత్యధిక అభివృద్ధి. . .

ఆరు అంశాల ఆధారంగా బోస్టన్‌ నివేదిక

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  03, 2020

(డిఎన్‌ఎస్‌) : మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్సుకత తో ఎదురు చూస్తున్న బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ)

ఆరు అంశాల ఆధారంగా నివేదిక సమర్పించిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. à°ˆ కమిటీ తన నివేదికలో సాగర తీరం ప్రాంతమైన విశాఖపట్నం

నగరం వైపే మ్రొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం సహా, అత్యవసర అసెంబ్లీ, రాజ్ భవన్, ప్రధాన కార్యాలయాలూ విశాఖ లోనే నెలకొల్పాలని నివేదిక

ఇచ్చినట్టు తెలుస్తోంది.  à°ˆ కమిటీ తన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమర్పించింది. తాడేపల్లి లోని సీఎం క్యాంప్

కార్యాలయం లో ఆయనతో భేటీ అయ్యి, తాము చేపట్టిన పరిశీలనను వివరించారు. వారు అందించిన నివేదిక లోని ప్రధాన అంశాలు :

ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2.2 లక్షల కోట్ల అప్పు

ఉంది
రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించారు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ

ఉత్పత్తి(వెస్ట్ గోదావరి, కృష్ణా) ఎక్కువగా ఉంది
ఎయిర్‌పోర్టు, పోర్టు విషయంలో విశాఖ తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి చెందలేదు
చేపల ఉత్పత్తి(60 శాతం) రెండు

జిల్లాలోనే అధికంగా ఉంది
రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది
8 జిల్లాల్లో ఇండస్ట్రియల్ ఏరియా తక్కువగా ఉంది
పర్యాటకంలో గత రెండేళ్లుగా

ఎటువంటి అభివృద్ధి జరగలేదు
కొన్ని కొన్ని మండలాలు నేషనల్ హైవే రావటానికి 4 ,5 గంటలు ప్రయాణం పడుతుంది 
ఉత్తరాంధ్ర  à°ªà±à°°à°¾à°‚తంలో మెడికల్ హబ్ టూరిజం, ఉత్తరాంధ్ర

సుజల స్రవంతి, బోగపురం ఎయిర్‌పోర్టు, పసుపు, కాఫీ పంటలు, అరకు లోయలో ఎకో అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధి చేయాలి
గోదావరి డెల్టాలో పెట్రోకెమికల్స్‌, ఫుడ్‌

ప్రాసెసింగ్‌, పోలవరం ప్రాజెక్టు, రోడ్‌ కనెక్టివిటీ, హార్టికల్చర్‌, కోనసీమ అభివృద్ధి చేయాలి
కృష్ణా డెల్టాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్, మచిలీపట్నం

పోర్టు, హెల్త్‌ హబ్‌ అభివృద్ధి చేయాలి
దక్షిణ ఆంధ్ర.. ఆటోమొబైల్‌ మానిఫాక్చరింగ్‌ , లెదర్ అండ్ ఫిషరీస్, మై పాడు బీచ్‌, గోదావరి- పెన్నా లింకేజీ అభివృద్ధి చేయాలి
/> వెస్ట్ రాయలసీమలో టెక్ట్స్ టైల్స్‌, ఆటోపార్ట్స్‌, సేంద్రీయ ఉద్యావన సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌, గోదావరి పెన్నా అనుసంధానం, హైవే కనెక్టివిటీ
ఈస్ట్ రాయలసీమ

ఎలక్ట్రానిక్స్‌ మానిఫాక్చరింగ్‌, స్టీలు ప్లాంట్లు, హైటెక్ అగ్రికల్చర్‌(టొమాటో ప్రాసెసింగ్‌), గండికోట, బేలం గుహల మధ్య ఎకో ఎడ్వంచర్‌ సర్క్యూట్‌
అమరావతి

ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం(మాస్టర్‌ ప్లాన్‌) దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవసరం(ఏపీసీఆర్‌డీఏ శ్వేతపత్రం- జూన్‌ 2019 ప్రకారం)
ఇందుకోసం ఏడాదికి దాదాపు 8 వేల

నుంచి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది
కానీ రాష్ట్రం ఇప్పటికే 2.25 కోట్ల రూపాయల రుణాల్లో కూరుకుపోయి ఉంది
కేవలం ఒకే ఒక్క పట్టనానికి ఇంత ఖర్చు

చేయడం రిస్కుతో కూడుకున్న పని
నిజానికి కొత్త పట్టణాల అభివృద్ధికి దాదాపు 30 నుంచి 60 ఏళ్ల సమయం పడుతుంది
చాలా వరకు గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు à°ˆ క్రమంలో ఎన్నో

ఆటంకాలు ఎదుర్కొన్నాయి
సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా పరిశీలించాం
అమరావతి ప్రాంతానికి వరదల ముప్పు ఎక్కువ(ఐఐటీ మద్రాస్‌, ఏపీ డిజాస్టర్‌ అథారిటీ

వివరాల ప్రకారం)
జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాలు బహుళ రాజధానుల ద్వారా ప్రభుత్వ సంస్థలు, పౌరుల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి 
కర్నూలు, అమరావతి,

విశాఖపట్నం రాజధానులుగా అనుకూలం
కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని మేలు అని సూచించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam