DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులకు మంచినీళ్లు కూడా ఇచ్చేది లేదు: అన్నదాతలు

అమరావతి అన్నదాతల ఆవేదనలు కొత్త పంథా. . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .. 

అమరావతి, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : అమరావతి à°•à°¿ భూములు ఇచ్చిన అన్నదాతలు

తమ ఆవేదనను కొత్త పంధాలో ప్రకటింస్తున్నారు. గత రెండున్నర వారాలుగా శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనలను పట్టించుకోకపోవడమే కాక, తమపై అక్రమంగా కేసులు

బనాయించి, జీవితాలను బుగ్గి పాల్గు చేస్తున్న పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కడుపు మండిన ఆనందాతలు అద్భుతమైన నిర్ణయాన్ని

తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసు సిబ్బందికి, యంత్రాంగానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకూడదు అని తీర్మానించారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతాల్లో ఎటువంటి

సదుపాయాలు లేకపోవడంతో మంచినీటికి కూడా బయట గ్రామాల పైనే ఆధార పడవలసి వస్తోంది. రోజుల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి మంచి నీళ్లు కూడా

ఇవ్వకూడదు అని అన్నదాతలు తీసుకున్న నిర్ణయం à°’à°• సహాయ నిరాకరణ పూర్వక గుణపాఠం à°—à°¾ మారనుంది. 

రాజధాని ప్రాంతమైన మందడంలో ఉదయం నుంచి బంద్ వాతావరణం నెలకొంది.

మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి రైతులు వచ్చారు. పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి

సౌకర్యాలు కల్పించరాదని గ్రామస్తులు నిర్ణయించారు. తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ

గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ

బంద్ పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింప చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam