DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర  ఏసీబీ డీజీ విశ్వజిత్ బదిలీ, డిజిపి ఆఫీస్ కి సరెండర్  

రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  04, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ లో

ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) డీజీ కుమార్ విశ్వజిత్ బదిలీ అయ్యారు. నూతన ఏసీబీ డీజీగా రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగాను సీతారామాంజనేయులు అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మరోవైపు రవాణా శాఖ కమిషనర్ గా కృష్ణబాబుకు అదనపు

బాధ్యతలు అప్పగించారు. బదిలీ అయిన కుమార్ విశ్వజిత్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏసీబీ వ్యవస్థను మరింత

పటిష్టపరిచే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి రెండు రోజుల కిందటే ఏసీబీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ వ్యవస్థపై తీవ్ర

అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా అంకిత భావంతో పని

చేయాలని అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు

అవినీతి నిరోధానికి 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన తరువాత వందలాది ఫిర్యాదులు అందుతున్నా

వాటిపై లేట్ à°—à°¾ రెస్పాండ్ అవుతున్నట్టు సమాచారం అందుతుందని అన్నారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలి. ప్రజలెవ్వరూ కూడా అవినీతిపై మళ్ళీ

మళ్ళీ లంచాలు తీసుకుంటున్నారు అంటూ ఫిర్యాదు చేయకూడదు అని సూచించారు. ఎమ్మార్వో, కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఇలా

ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి. రాబోయే మూడు నెలల్లోగా కచ్చితంగా మార్పు కనిపించాలని.. అవసరమైతే సిబ్బందిని ఎంత

మందిని కావాలన్నా ఇస్తానని అధికారులకు చెప్పారు. మరో నెల రోజుల తరువాత ఏసీబీపై సమీక్ష చేస్తాం అని సమీక్షలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam