DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజారాజధాని అమారావతిలోనే ఉండాలి : ఎమ్మెల్సీ

శాంతియుత నిరసనలు తప్పా? అరెస్టులకు బయపడం

విశాఖను కబ్జా చేసేందుకే తరలింపు : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

.

అమరావతి, జనవరి  07, 2020 (డిఎన్‌ఎస్‌) : అమరావతి తరలింపుకు నిరసనగా దీక్షలు చేస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్సీ

రాజేంద్రప్రసాద్ ను మంగళవారం ఉయ్యూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ప్రసాద్ మాట్లాడారు. పులివెందుల మాఫియా, రౌడీలు విశాఖను ఆకృమించాలనే ఉద్దేశంతో ఏ.పి సీఎం జగన్మోహన రెడ్డి అభివృద్ధిపేరుతో ప్రజారాజధాని అమరావతిని

తరలిస్తున్నారని తుగ్లక్ పరిపాలన అంటూ పరిపాలనా తీరును విమర్శించారు.

విశాఖను పర్యాటక ప్రాంతంగా, స్టీల్ సిటీగా రెండు ఓడరేవులతో ,ఫార్మాహబ్ గా ఐటిహబ్ గా,

వివిధ పరిశ్రమలతో, దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను మేమందరం చూస్తుంటే రాజధానితరలింపు పేరుతో  à°ªà±à°²à°¿à°µà±†à°‚దుల మాఫియాకు విశాఖ భూములను కట్టబెట్టాలని

ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేసారని  à°°à°¾à°œà±‡à°‚ద్రప్రసాద్ అన్నారు.

చంద్రబాబు మీద కక్షతో,రైతుల మీద కక్షతో, సామాజిక వర్గం మీద కక్షతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజారాజధాని

తరలిస్తూ ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు.

భూములిచ్చిన రైతులకు అండగా నిలుస్తున్న మమ్మల్ని హౌస్అరెస్టులు చేస్తే భయపడేది లేదని ఉద్యమాన్ని

ఆపలేరని, పోలీసులతో భయపెట్టడానికి ప్రయత్నిస్తే, దౌర్జన్యం చేయించినా భయపడం, ఖబడ్ధార్.. అంటూ ప్రజా, రైతు పక్షమే అంటూ హెచ్చరించారు.

ఈ సమావేశములో సీడీసీ

చైర్మన్ పిచ్చిరెడ్డి, amc మాజీ చైర్మన్ అబూకలాం, టీడీపీ నాయకులు చేదుర్తి పాటి ప్రవీణ్ కుమార్, రాజులపాటి. ఫణి, సయ్యద్ అజ్మతుల్లా, పంద్రాజు చిరంజీవి , మోదుగుమూడి

కుటుంబరావు, గోరంట్ల నరేంద్ర ఈడే అంజిబాబు, పరిమి భాస్కర్, కటారపు తిరుపతి రావు, చలపాటి శ్రీను, పోనుగుమాటి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam