DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు స్వార్ధానికి ఆంధ్రా ప్రజా, అమరావతి రైతాంగం బలి

వెన్ను పోటుతనం బాబు నరాల్లో జీర్ణించుకు పోయింది.  

 

ఐదేళ్ల కాలంలో రాజధానికి పునాది రాయి కూడా వెయ్యలేదు  

దాడిలో విద్యార్థులంటే క్షమించండి:

జగన్ కు వినతి 

బాబు ఎన్టీఆర్ కె కాదు, విద్యార్థులకూ వెన్నుపోటు పొడిచాడు 

విశాఖే రాజధాని అని శివరామకృష్ణ కమిటీ à°•à°¿ సూచన చేసాం  

బాబు వైఖరి పై

మాజీ ఎమ్మెల్యే రహమాన్ అంతరంగం ప్రకటన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు

చంద్రబాబు నాయుడు అహంభావ పూరిత స్వార్ధానికి అమరావతి రైతాంగం బలి అవుతోందని ఉడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ రహ్మాన్ మండిపడ్డారు. బుధవారం విశాఖ

లోని à°’à°• హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తానూ ఇటీవలే తెలుగుదేశం పార్టీ à°•à°¿ రాజీనామా చేసానని, కేవలం చంద్రబాబు  à°•à±„రత్వంతో కూడిన

స్వార్ధానికి వేలాది మంది టిడిపి నాయకులూ, కార్యకర్తలు బలయ్యారని, వారిలో తానూ కూడా ఒకడిని అన్నారు. à°ˆ సందర్బంగా ఆయన తన అంతరంగాన్ని బహిర్గతం చేసారు.  
à°—à°¤

దశాబ్దాల కాలం à°—à°¾ తెలుగుదేశం పార్టీతో తనకు అనుబంధం ఏర్పడిందని, నాడు పార్టీ వ్యవస్థాపకులు  à°à°¨à±  à°Ÿà°¿ రామారావు పిలుపు మేరకు పార్టీలోకి వచ్చామని, అయన

ఆశీస్సులతోనే మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే గా ఎన్నికైనట్టు తెలిపారు. తదుపరి చంద్రబాబు నాయుడు తన రాజకీయ దుర్దాతో ఒకరిని బూచి గా చూపించి, పార్టీ ఎమ్మెల్యే లను

లొంగదీసుకుని తప్పుదారి పట్టించారన్నారు. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి దించేందుకు తమను హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ లోకి మార్చారని, ఆ సమయంలో కేవలం 40 మంది

మాత్రమే బాబు వెంట ఉన్నారన్నారు. అయితే ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ లు కూడా బాబు కు మద్దతు ప్రకటించడంతో బాబు తొలిసారి

అధికారంలోకి వచ్చారన్నారు. ఆ సమయంలోనే వెంకటేశ్వర రావు కు ఉప ముఖ్యమంత్రి లేదా, పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు టీడీఎల్పీ తీర్మానించిందన్నారు. అయితే రెండు

నెలలు దాటినా దగ్గుబాటి పదవి ఇచ్చేందుకు  à°šà°‚ద్ర బాబు ససేమిరా అనడంతో తానూ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు ఇద్దరో ఇదే విషయమై బాబు ను కలిస్తే తమను తీవ్రంగా మందలించడం

జరిగిందన్నారు. ఆ క్షణం నుంచి దగ్గుబాటి ని తాము విడిచిపెట్టేశామన్నారు. ఇది మా రాజకీయ స్వార్ధం కోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. అనంతర కాలం లో బాబు తీసుకునే

నిర్ణయాల్లో అత్యంత కీలకమైన, ప్రదమకరం గా మారింది తెలుగుదేశం విద్యార్థి విభాగాన్ని పూర్తి గా రద్దు చేశాడన్నారు. విద్యార్థులకు రాజకీయాలు అనవసరమని, కేవలం

వాళ్ళు చదువుకోలేనన్నారు. దీనిపై తాము ఖండించడం జరిగిందన్నారు. నేడు రాజకీయ నేతలుగా ఉన్నవారంతా విద్యార్థి రాజకీయాల నుంచీ వచినవారేనన్నారు. తిరిగి నేడు

అధికారం కోల్పోయాక చంద్రబాబు మళ్ళీ విద్యార్థులను తన స్వార్ధానికి లొంగదీసుకుని, చెయ్యకూడని పనులన్నీ చేయిస్తున్నారన్నారు. 

చంద్రబాబు చేసే ప్రతీ

పనిలోనూ కేవలం తన అహంకారంతో కూడిన స్వార్థం ఒక్కటే ఉంటుందన్నారు. అప్పుడు రద్దు చేసిన విద్యార్థి విభాగాన్ని రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ప్రారంభించడమే

దీనికి నిదర్శనమన్నారు. 

అమరావతి లో పునాది రాయి కూడా వెయ్యలేదు :. . .

ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ తన స్వార్థం కోసం రైతుల నుంచి 35 వేల  à°Žà°•à°°à°¾à°² భూమిని సొంతం

చేసుకున్నాడని, కనీసం అక్కడ ఒక్క పునాది కూడా వెయ్యలేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో అధికారం లో ఉన్న చంద్రబాబు ఏమి చేసాడో చెప్పాలన్నారు. నాయకులూ ఎవరైనా అతను చేసిన

తప్పులు ఎట్టి చూపిస్తే వాళ్లపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటాడన్నారు. దానిలో భాగమే సుజనా చౌదరి,  à°¸à±€à°Žà°‚ రమేష్, టిజి వెంకటేష్, మోహన్ రావు లాంటి రాజ్యసభ నాయకులూ

సైతం విభేదించి బీజేపీ లో చేరారన్నారు. ఎందరో క్షేత్ర స్థాయి పార్టీ నాయకులూ, కార్యకర్తలూ ఇతర పార్టీల్లో చేరిపోయారన్నారు.  

సీఎం గారూ. . . రైతులను ఆదుకోండి. : . . .

ప్రజల అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సు కోసం అని ప్రచారం చెయ్యడం వల్లనే అమరావతి ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వేలాది ఎకరాల భూములను ఇచ్చారన్నారు. అయితే

చంద్రబాబు చేతగాని తనం వాళ్ళ à°† భూములు బుగ్గిపాలయ్యాయన్నారు. పూర్తిగా ప్రక్కదారి పట్టిన à°ˆ రాజధాని వ్యవహారం లో రైతులకు అన్యాయం  à°œà°°à±à°—కుండా ఆదుకోవాలని, రాష్ట్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని రహ్మాన్ కోరుతున్నారు. మంగళవారం గుంటూరు జిల్లా చైనా కాకాని గ్రామంలో ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి కారుపై జరిగిన దాడిలో

విద్యార్థులు ఎవరైనా ఉంది ఉంటె వారిని పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. వారు అమాయకులని, బాబు చెప్పడం వల్లనే దాడికి దిగారన్నారు. అంటే తమ్మ విద్యార్థులకు

ఎటువంటి అభిప్రాయభేదాలూ లేవన్నారు. 

విశాఖ రాజధాని అయితే ప్రపంచ స్థాయి కి చేరుతుంది:

ముఖ్యమంత్రి అసెంబ్లీయే లో ప్రకటించినట్టుగా రాష్ట్రంలో మూడు

రాజధానులు ఉంది, విశాఖనగరం కార్యనిర్వాహక రాజధాని గా మారితే నేడు మెట్రో నగరం గా ఉన్న విశాఖ త్వరలోనే ప్రపంచాన్ని తలదన్నే మహా నగరంగా మారిపోతుందన్నారు. వైఎస్

జగన్ మంచి విజనరీ ఉన్న నాయకుడని, అమలు చేస్తున్న పధకాలు కేవలం పేద బడుగు, బలహీన వర్గాలకు చేరే విధంగా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.  

విశాఖే

రాజధాని అని శివరామకృష్ణ కమిటీ à°•à°¿ సూచన చేసాం: . . . 

రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ ఎదుట, విశాఖపట్నం ను

రాజధానిగా చేస్తే ప్రపంచం లోనే అగ్రగామి నగరంగా మారుతుందని ఆనాడే తాను సూచించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఏమాత్రం ప్రజాదరణ లేని తన కొడుకును ఎలాగైనా అధికారం

లో కూర్చోబెట్టాలి అనే ఏకైక స్వార్ధ పూరిత కారణంతో అమరావతి ని ఎంచుకున్నదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam