DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార లెక్కలతో అడా కత్తెరలో పోకచెక్కలా అధికార పార్టీ. . .

రాజధాని నిర్మాణ వ్య లెక్కలు బహిర్గతం - కమిటీ కు ఇబ్బంది 

62 పనుల్లో నిర్మాణ వ్యయం రూ. 5674 కోట్లు

సగం కట్టిన భవనాలు ఏంచెయ్యాలి? అయోమయంలో కమిటీ   

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .. .

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°…ధికార లెక్కలతో à°…à°¡à°¾ కత్తెరలో పోకచెక్కలా 
తయారైంది అధికార పార్టీ పరిస్థితి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని ప్రాంతం  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ నిర్మాణాలు లేవని, అంతా డొల్లేనని చెప్పుకుంటూ వచ్చిన మంత్రులకు షాకిచ్చేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు.

ఈ నివేదికను నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులకే అందించారు. ఈ నివేదిక మేరకు నిర్మాణాలకే 5674 కోట్లు ఖర్చు జరిగినట్లు పేర్కొనడం విశేషం. అయితే తాజాగా రాజధాని మార్పు

ఆలోచన నేపథ్యంలో ఈ ఖర్చు చేసిన నిధుల పరిస్థితి ఏమిటి, సగం సగంలో ఉన్న నిర్మాణాల పరిస్థితి ఏమిట న్నది ప్రశ్నార్ధకంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


/> చంద్రబాబు ముఖ్యమ0త్రిగా ఉన్న సమయంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్పు చేసే0దుకు నిర్ణయి0చి భారీగా కసరత్తు చేశారు. అయితే ఆలోచనను అమలు రూపంలోకి

తీసుకురావడంలో చేసిన జాప్యం కారణంగా మూడు పనులు తప్ప మిగినివన్నీ తక్కువ శాతం మాత్రమే జరిగాయి. మౌలికాభివృద్ధి పేరుతో రోడ్లు, తాగునీరు, మురుగు నియంత్రణ,

విద్యుత్‌ వంటి వాటికి దాదాపు 20 వేల కోట్లతో 27 పనులకు అనుమతి ఇవ్వగా, à°…0దులో ఇప్పటివరకు 2,761 కోట్లు ఖర్చు చేశారు. అలాగే భూము లిచ్చిన వారి కోసం సిద్ధంచేస్తున్న

లేఅవుట్లకు 449 కోట్లు, వివిధ వర్గాల కార్యాలయాలు, వసతి కోసం 1695 కోట్లు, తాత్కాలిక ప్రభుత్వ కాంప్లెక్స్‌కు 522 కోట్లు, సచివాలయంలో ఇతర పనులకు 58 కోట్లు, కోర్టు

సముదాయానికి 97 కోట్లు, ప్రాజెక్టు కార్యాల యానికి 44 కోట్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలకు నీటి సర ఫరా కోసం 15 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. మొత్తం 62

పనులకు 52,837 కోట్ల అ0చనాతో పనులు ఖరారు చేయగా, అ0దులో 41,678 కోట్ల విలువైన పనులను ప్రారంభి0చారు. ఇ0దులో 5674 కోట్లు ఖర్చు జరిగినట్లు గుర్తి0చారు.
ఇలా ఉ0డగా, శాసనసభ్యులు,

శాసనమండలి సభ్యులు, అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాల నిర్మా ణాల్లో 77 శాతం భౌతిక పనులు, 52 శాతం ఆర్ధిక వ్యయం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఉద్యోగుల

వసతి నిర్మాణాల్లోనూ భౌతిక లక్ష్యం 69 శాతం ఆర్ధిక లక్ష్యం 46 శాతం, ఇతర నివాసాలకు సంబంధి0à°šà°¿ 51 శాతం వ్యయం జరిగినట్లు గుర్తి0చారు. అయితే ఫేజ్‌-2 పనులకు సంబంధి0à°šà°¿

ఉద్యోగులకు వసతి, అధికారులకు ఇళ్లు, మంత్రులు, న్యాయ మూర్తులు, శాఖాధిపతులు వంటి వారి నివాసాలకు సంబంధి0చిన పనులు ఏడు నురచి 20 శాతం మధ్యలో జరిగినట్లు

గుర్తి0చారు.

తాజాగా రాజధానిని విశాఖకు మార్పు చేసే ఆలోచన నేపథ్యంలో భారీ వ్యయంతో నిర్మి0à°šà°¿à°¨ ఈకట్టడాలను ఏమి చేయాలన్నది హైపవర్‌ కమిటీ మురదున్న కీలక

ప్రశ్నగా కనిపిస్తో0ది. ఈ నిర్మాణాలను అలాగే వదిలేస్తే వేల కోట్లు వృధాగా పోతాయని చెబుతున్న అధికారులు, పూర్తి చేస్తే ఎలా, వేటికి ఉపయోగి0చుకోవాలన్నదానిపై

మల్లగుల్లాలు పడుతున్నారు. హెచ్‌ఓడిలను కూడా విశాఖకు తరలిస్తే అమరావతిలో భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం ఖాయమన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనా

హైపవర్‌ కమిటీ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తో0ది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam