DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏడు నెలల అధికారంలో నేటికీ  కొత్త జిల్లాల మాటే లేదాయె? 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌ను 25 జిల్లాలుగా చేస్తాం. 25 పార్లమెంట్ స్థానాలను జిల్లాలుగా చేస్తాం.

ఇది వైసీపీ అధికారంలోకి రాక ముందు à°† పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు. అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్

స్థానాలను జిల్లాలుగా చేస్తామని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఆ పార్టీనే. దాదాపు ఏడు నెలలైంది అధికారంలోకి వచ్చి. కానీ ఇప్పుడు ఆ ఊసే

వినపడం లేదు. మరిచిపోయారా? లేదా? ప్రస్తుతం à°† విషయం పక్కన పెట్టారో తెలియట్లేదు. రాజధాని తరలింపు అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను à°—à°¤ కొద్ది రోజులుగా భీకరంగా

కుదిపేస్తోంది. 3 రాజధానులు చేయబోతున్నామని సీఎం జగన్.. à°† తర్వాత జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు కూడా 3 రాజధానులకు పచ్చ జెండా ఇచ్చేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం హైపవర్

కమిటీ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. 

ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా.. అమరావతిలో మాత్రం ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. రాజధాని వేడి అంతకంతకు

రాజుకుంటోంది. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త జిల్లాల ఊసే ఎత్తడం లేదు. ఇంతలోనే స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు జోక్యం చేసుకుని మార్చి 3లోపు ఎన్నికలు

నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చింది. కోర్టు అలా చెప్పగానే స్థానిక ఎన్నికలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో

పార్టీ గెలుపుపై మంత్రుల భుజస్కంధాలపై మోపారు. రాజధాని అంశం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ వాయిదా వేసుకున్నట్లుగానే

తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam