DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమ్మఒడి అర్హత ఉండి, రేషన్, ఆధార్ లేని వారికి మరొక అవకాశం    

రేషన్, ఆధార్ లేని వారు ఫిబ్రవరి 9 లోగా దరఖాస్తు    

వైభవంగా  à°œà°—నన్న అమ్మఒడి పధకం ప్రారంభం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం /

చిత్తూరు, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌): పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పధకం కు అర్హత ఉండి, తెల్ల రేషన్ కార్డు లేనివారికి, ఆధార్

కార్డు లేనివారికి మరొక సారి అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం చిత్తూరు లో నిర్వహించిన జగనన్న

అమ్మఒడి  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ ప్రారంభోత్సవ సందర్బంగా అయన à°ˆ ప్రకటన చేసారు. అమ్మఒడి పధకానికి దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థి తల్లికి తెల్ల రేషన్ కార్డు ఉండాలని,

తప్పని సరి చేయడం తో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అర్హత ఉంది కూడా దరఖాస్తు చేసుకోలేక పోయిన విషయం తెలిసిందే. .   అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో

చదువుతున్న ప్రతి విద్యార్థికి అర్హతలు ఉంటె ఏడాదికి రూ. 15 వేలు అందించనున్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ పేదింటి

తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని.. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది

విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని.. అయితే వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం అటెండన్స్‌ ఉంటేనే పథకం వర్తిస్తుందని

స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందని... అర్హత ఉండి లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోవాలని సీఎం

జగన్‌ విఙ్ఞప్తి చేశారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి సీఎం

జగన్‌ ప్రజలకు వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam