DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం కు అటల్ యోజన జాతీయ పురస్కారం 

జాతీయ అవార్డు అందుకున్న యల్.డి.యం

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) :. . . .

శ్రీకాకుళం, జనవరి 9 :

 à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి అటల్ పెన్షన్ యోజన ( పీ à°Žà°‚ ఏ పీ à°Ÿà°¿ ), సిటిజన్స్ ఛాయిస్ 2019 అమలులో శ్రీకాకుళం జిల్లాకు జాతీయ స్ధాయి అవార్డు లభించింది. à°ˆ అవార్డును జిల్లా లీడ్ బ్యాంకు

మేనేజర్ జి.వి.బి.డి హరిప్రసాద్ గురు వారం ఢిల్లీలో పి.పెచ్.డి ఛాంబార్ శ్రీరాం హాల్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. పి.ఎఫ్.ఆర్.డి.ఏ చీఫ్ జనరల్ మేనేజర్ ఆషిష్

కుమార్, భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజింగు డైరక్టర్ రమేష్ బాబు, పి.ఎఫ్.ఆర్.డి.ఏ ఆర్ధిక విభాగం ప్రతినిధి సుప్రతిమ్ బందోపాధ్యాయ ఈ అవార్డును అందజేసారు. పి.ఎఫ్.ఆర్.డి.ఏ,

డి.ఎఫ్.ఎస్ అధికారులు ఈ అవార్డును అందించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పి ఎఫ్ ఆర్ డి ఏ ) మరియు డిపార్టుమెంటు ఆఫ్ సైనాన్సియల్ సర్వీసెస్

(డి ఎఫ్ ఎస్) ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారని హరి ప్రసాద్ తెలిపారు. పి.ఎం అటల్ పింఛన్ యోజన క్రింద జిల్లాలో ఆగష్టు నుండి నవంబరు 30వ తేదీ వరకు 48,956 మందిని నమోదు

చేయడం జరిగిందని ఆయన చెప్పారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఈ పథకంలో చేరుటకు అర్హులని పేర్కొన్నారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న అభ్యర్ధులు ఈ

పథకంలో చేరి బ్యాంకులో పాసు పుస్తకం ప్రారంభించి పొదుపు చేయవచ్చని అన్నారు. ఖాతాదారుడు తన 40వ ఏట వరకు ఖాతాలో పొదుపు చేసిన అనంతరం తనకు 60 సంవత్సరాలు పూర్తి అయిన

తరువాత పింఛను అందుతుందని అన్నారు. పింఛను యోజనకు తన వాటాగా ఎంత మొత్తం డిపాజిట్ చేస్తే అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కలిపి పింఛనుగా చెల్లిస్తుందని

అన్నారు. కనిష్టంగా రూ.3 వేలు, గరిష్టగా రూ.10 వేల నుండి రూ.15 వేలు పింఛనుగా అందుటకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పింఛనుపై అవగాహన కార్యక్రమాలను ఆగష్టు నుండి

సిటిజన్స్ ఛాయిస్ లో భాగంగా చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటి నివేదిక అధారంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాతోపాటు కృష్ణా,

అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాలు ఈ అవార్డుకు ఎంపిక అయ్యాయని చెప్పారు. తెలంగాణా నుండి రెండు జిల్లాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. జిల్లాకు ఈ అవార్డు

రావడంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణచక్రవర్తి ప్రోత్సాహం, దార్శనికత

తోడ్పడిందన్నారు. ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ మరియు డిసిసి కన్వీనర్ పి.కృష్ణయ్య, సహాయ జనరల్ మేనేజర్ కె.వెంకట్రాజు, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు, సమన్వయ

అధికారుల సమష్టి కృషితో ఈ అవార్డు రావడం జరిగిందని ఎల్.డి.ఎం వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam