DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి ఉద్యమ విరాళాల కోసం జోలె పట్టిన చంద్రబాబు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌):  à°…మరావతి పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా

చంద్రబాబు ప్రజా చైత్యనయాత్ర చేపట్టారు. గురువారం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు యాత్ర చేపట్టారు. దారి పొడవునా చంద్రబాబుకు ప్రజలు రోడ్డుపైకి వచ్చి సంఘీభావం

తెలుపుతున్నారు. పోరంకి, తడిగడప, పెనమలూరులో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబు విరాళాల సేకరణకు

జోలె పట్టారు. కోనేరు సెంటర్‌లో జోలె పట్టి విరాళాలు సేకరించారు. చంద్రబాబుతోపాటు సీపీఐ నేత రామకృష్ణ, అమరావతి జేఏసీ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు

పాల్గొన్నారు.

మరోవైపు నిన్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ గురువారం అనంతపురం టవర్ క్లాక్ ముందు టీడీపీ

నేతలు, కార్యకర్తలు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రతిపక్ష నేత

చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. రైతులు 22 రోజులపాటు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తుంటే.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు..

వారికి సంఘీభావం తెలపడానికి వస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది

కోసం పనిచేయాలని సూచించారు. ఉద్యమాలను ఎవరూ ఆపలేరని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam