DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్షేమ పధకాలు ప్రజలకే చేర్చేది వాలంటీర్ లే.

అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే లు సూచన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న

సంక్షేమ పథకాలను  à°ªà±à°°à°œà°²à°•à± చిరు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాల్సిన బాధ్యత వాలంటీర్ల పై ఉన్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

అందించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విశాఖ జిల్లా అనకాపల్లి లోక్ సభ సభ్యులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± బి వి సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

అనకాపల్లి పట్టణంలోని వేల్పులవీధి సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం జివిఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొని

మాట్లాడుతూ గ్రామ వాలెంటర్లు ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడంలో కీలకపాత్ర

పోషించాలన్నారు. అమ్మఒడి పథకంలో పట్టణ ప్రాంతంలో పది వేల మంది రూరల్ ప్రాంతంలో ఇరవై రెండు వేల మంది సుమారుగా లబ్ధి పొందారన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నీయ మితులైన

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు .అలాగే ఆదరణ పథకంలో 122 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దంతులూరి దిలీప్

కుమార్, మందపాటి జానకిరామరాజు , అళ్ళ నాగేశ్వరరావు ,ఉగ్గిన అప్పారావు, సూరిశెట్టి రమణ, జాజుల రమేష్, పిడి గాంధీ, బొడ్డేడ శివ,  à°Žà°²à±à°à°¸à°¿ శ్రీనివాసరావు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam