DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటూన్నాడు : అవంతి

రాజధానిని స్వాగతిస్తూ విశాఖ లో మంత్రి అవంతి భారీ ర్యాలీ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : మూడు రాజధానుల

నిర్ణయానికి మద్దతుగా, విశాఖ గాజువాకలో మూడు రాజధానులను స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక లో శుక్రవారం జరిగిన à°šà°‚ద్రబాబు, పవన్ లపై ఆయన విరుచుకు పడ్డారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలతోనే తన  à°œà±€à°µà°¿à°¤à°®à°‚తా  à°‰à°¨à±à°¨à°¾à°°à°¨à°¿. కులాలు, మతాలు ప్రాంతాలు పేరుతో ప్రజల మధ్య

విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి à°—à°¾ చేసిన చంద్రబాబు కుల ప్రయోజనాల కోసమే పని చేశారు. అయితే ప్రజా సంక్షేమానికి పని చేయకుండా  à°¤à°¨

సామాజికవర్గ అభివృద్ధికే పాటు పడ్డారు. ప్రసుతం చెంద్రబాబు చేసేది పూర్తిగా స్వార్ధ పూరిత వైఖరి అని, అమరావతి లో రైతులను తన స్వార్ధానికి వాడుకుంటు, వారికి

ద్రోహం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఓట్లు వేస్తేనే బాబు సీఎం అయ్యాడు.. అమరావతి ప్రజలు ఒక్కరు వేస్తేనే కాలేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష

నేతగా వుండటం దురదృష్టకరం అని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోవాలని, పరిణితి చెందిన నేతగా ఎదగాలని సూచించారు. పవన్ కు నిజంగా అమరావతి పై అంత ప్రేమ

ఉంటే అక్కడే పోటీ చేసి ఉండాల్సింది, అయితే గాజువాక లో ఎందుకు పోటీ చేశారు అని ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు పవన్

సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటూన్నాడని ఎద్దేవా చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam