DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్                                

(DNS రిపోర్ట్ : సాయిరాం సి వి ఎస్, బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  10, 2020

(డిఎన్‌ఎస్‌) : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ à°¡à°¾. ఎన్. రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

 à°œà°¡à±à°ªà°¿à°Ÿà°¿à°¸à°¿, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశల్లో

ఎన్నికలు నిర్వహించాలని, ఓటరు జాబితాను సిద్దం చేసుకోవాలన్నారు.  à°¨à±‹à°Ÿà°¿à°«à°¿à°•à±‡à°·à°¨à± జారీ చేసినప్ఫటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు.

పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు చేయాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. 
     à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా కలెక్టర్ వి.

వినయ్ చంద్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బాలట్ పేపర్ల ముద్రణ, ఓటరు జాబితా, పోలింగ్ సిబ్బంది అవసరాలు, పోలీసు బందోబస్తు తదితర అన్ని

ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మొదటి దశ లోఅనకాపల్లి పార్ట్-1 లో 10 మండలాలు 10 జడ్పిటిసిలు, 176 ఎంపిటిసిలు, పోలింగ్ స్టేషన్లు 603, నర్సీపట్నం పార్ట్-1 లో 6 మండలాలు, 6

జడ్పిటిసిలు, 112 ఎంపిటిసిలు 370 పోలింగ్ స్టేషన్లు, విశాఖపట్నం లో 6 మండలాలు, 6 జడ్పిటిసిలు, 86 ఎంపిటిసిలు, 273 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు.  à°°à±†à°‚à°¡à°µ దశ  à°²à±‹ అనకాపల్లి

పార్ట్-2 లో 2 మండలాలు 2 జడ్పిటిసిలు, 38 ఎంపిటిసిలు, 130 పోలింగ్ స్టేషన్లు, నర్సీపట్నం పార్ట్-2 లో 4 మండలాలు, 4 జడ్పిటిసిలు, 67 ఎంపిటిసిలు, 215 పోలింగ్ స్టేషన్లు, పాడేరు డివిజన్ లో 11

మండలాల్లో 11 జడ్పిటిసిలు, 172 ఎంపిటిసిలు, 486 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.  39 మంది రిటర్నింగ్ అధికారులు, 39 మంది ఎంపిడిఓలు, 39 తహసిల్థార్లను

అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు.  à°µà±€à°°à°¿à°•à°¿ శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ఆయన

వివరించి, పోలీసు బందోబస్తు గూర్చి తెలియజేశారు.  
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ తోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి

గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అట్టాడ బాపూజీ, డిసిపిలు

ఉదయ్ భాస్కర్, రంగారెడ్డి, డిఆర్ఓ ఎం శ్రీదేవి, జిల్లా పరిషత్ సిఇఓ,డిపిఓ నాగార్జున సాగర్, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam