DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ కళాశాలలో గణతంత్ర దినోత్సవం :కలెక్టర్ నివాస్ 

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత గణతంత్ర

దినోత్సవాన్ని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు తగిన  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à± చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్

అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్ర వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 26వ తేదీ ఉదయం

ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భారత గణతంత్ర దినోత్సం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ నిర్వహణకు మైదానాన్ని సిద్దం చేయాలని

రెవిన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. పారిశుధ్యాన్ని, తాగు నీటి ఏర్పాట్లను నగరపాలక సంస్ధ పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ శాఖలు తమ

శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ, అటవీ శాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ, జిల్లా గ్రామీణ

అభివృద్ధి సంస్ధ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమం, ఎస్.సి, బి.సి సంక్షేమం, రహదారి భద్రత –పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యా, వైద్య శాఖలు ప్రదర్శన శాలలను

ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవం నిర్వహించే మైదానంలో ఉదయం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిని,

జిల్లా పౌరసంబంధాల అధికారిని ఆదేశించారు. జాతీయ గీతాలు విభిన్నంగా ఉండాలని సూచించారు. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండే గీతాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని

చెప్పారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలకు జాబితాను సమర్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రతిభ ప్రశంసా పత్రాలు అందుకునే వారు ఉత్తమ ఉద్యోగులుగా ఉండాలని, ఇతర ఉద్యోగులకు ప్రేరణ కలగాలని అన్నారు. ఉద్యోగుల పేర్లతోపాటు వారు ఏ విధంగా ప్రశంసా

పత్రానికి అర్హులో తెలియజేస్తూ వివరణ విధిగా సమర్పించాలని ఆదేశించారు. ప్రశంసా పత్రం పొందినవారికి సార్ధకత ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో డివిజనల్ అటవీ

అధికారి సందీప్ కృపాకర్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, అదనపు ఎస్పి జి.గంగరాజు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, నగర పాలక సంస్ధ కమీషనర్ ఎం.గీతాదేవి,

ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య, వంశధార ఎస్.ఇ పి.రంగారావు, జలవనరుల శాఖ ఎస్.ఇ బి.రాంబాబు, జిల్లా గ్రామీణ

అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్య లక్ష్మి, బి.సి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, గురుకులం

జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, ఆరోగ్యశ్రీ కె.సాయిరాం, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam