DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ వీసీగా జగన్నాథరావు బాధ్యతలు స్వీకరణ  

పూర్ణకుంబంతో  à°˜à°¨à°¸à±à°µà°¾à°—తం, అభినందనల వెల్లువ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

రాజమహేంద్రవరం / విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు

గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ నూతన ఉపకులపతి గా డాక్టర్ మొక్క జగన్నాథరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.

విశ్వవిద్యాలయానికి వీసీ హోదాలో తొలిసారి వచ్చిన జగన్నాథరావు కు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా

విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద ఉన్న నన్నయ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. అలాగే డా.బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న అంబేద్కర్

విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. తరువాత పూర్ణకుంబంతో వేదపండితుల మంత్రోచ్చనల నడుమ వీసీ చాంబర్ కు వచ్చి వీసీ బాధ్యతలను స్వీకరించారు.

విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థిని విద్యార్థులు వీసీ కి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.

క్యాంపస్ లోని ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలలకు చెందిన అన్ని విభాగాల అధ్యాపకులు విభాగాల వారికి వీసీ కి

శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాకినాడ క్యాంపస్, తాడేపల్లిగూడెం క్యాంపస్ కు చెందిన అధ్యాపకులు వీసీ కి శుభాకాంక్షలను

తెలియజేసారు. ఉభయగోదావరి జిల్లాల్లోని నన్నయ అనుబంధ కళాశాలలకు చెందిన వారు వీసీ ప్రత్యేక శుభాకాంక్షలను అందించారు. అనంతరం వీసీ ఆచార్య జగన్నాథరావు

విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసారు. అధ్యాపకులంతా పరిశోధనలపై దృష్టిసారించాలని ఎక్కువ పరిశోధన పత్రాలను ప్రచురించాలని

అన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు విశ్వవిద్యాలయానికి ప్రోజెక్టులను తీసుకురావాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకు అధ్యాపకులతో వ్యక్తిగత రివ్యూ సమావేశాన్ని

ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులను మంచి పరిశోధకులుగా తయారు చేయాలని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam