DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 15 నుంచి త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

విశాఖ వేదికగా త్యాగరాజ ఆరాధనలో 862  à°•à°šà±‡à°°à±€à°²à±

కళాభారతి వేదిక గా వందలాది మంది తో సంగీత నీరాజనం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : , . . .

.

విశాఖపట్నం, జనవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : కర్ణాటక శాస్త్రీయ సంగీత కళానిధి సద్గురు త్యాగరాజ స్వామికి విశాఖ నగరం వేదికగా ఉత్తరాంధ్రా సంగీత కళాకారులు సంగీత

నీరాజనం అందించనున్నారు. à°ˆ నెల 15 నుంచి ఐదు రోజుల పాటు ( 19 వరకు) విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సహకారం తో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో విశాఖ నగరం లోని

మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి కళా ప్రాంగణం లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.  à°ˆ మేరకు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి

ప్రాంగణం లో నిర్వాహకులు నిర్వహించిన విలేకరుల. సమావేశం లో వీఎండీఏ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) మాట్లాడుతూ  à°µà°‚దలాది మంది వర్ధమాన సంగీత కళాకారుల

నుంచి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రసిద్ధ కళాకారులు ఇదే వేదికపై గాత్ర కచేరీలు, వీణ కచేరీలు, వయోలిన్ కచేరీలు చేయనున్నారని తెలిపారు. ఈ ఉత్సవాల్లో మొత్తం ఏ హై

గ్రేడ్ విద్వాంసులు 12 మంది, బి  à°¹à±ˆ గ్రేడ్ విద్వాంసులు 23 మంది, బి గ్రేడ్ విద్వాంసులు 10 మంది పాల్గొంటున్నారు .

15 à°¨ తిరువీధి శోభాయాత్ర :. . . 

జనవరి 15 , 2020 పుష్య బహుళ

పంచమి నాడు కళాభారతి లో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయంలో విశేష పూజలు చేసి ఏడున్నర à°—à°‚à°Ÿà°² నుంచి 8 :15 వరకు సీతా రామ లక్ష్మణ à°­à°°à°¤ శత్రుఘ్న హనుమత్  à°µà°¿à°—్రహాలను పల్లకిపై

అలంకరించి, 150 à°•à°¿ పైగా కళాకారులు  à°•à°³à°¾à°­à°¾à°°à°¤à°¿ చుట్టూ ఉన్న మాడ వీధులలో త్యాగరాజ కీర్తనలు గానం చేస్తూ ఉండగా, కళాభారతి కార్యదర్శి రాంబాబు త్యాగరాజ వేషధారణలో à°Šà°‚à°›

వృత్తి చేస్తూ ఉండగా, శోభాయాత్ర తిరువీధి ఉత్సవం సాగుతుంది.

పంచరత్న సేవ :. . . 

ఉదయం 8:15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనం గావించి 250 మంది కళాకారులు త్యాగరాజ

స్వామివారి పంచరత్న కృతులను బృందగానం చేస్తారు. అనంతరం గురువుల అప్పన్న నాదస్వర కచేరి తో ప్రారంభమై రాత్రి 9:30 à°—à°‚à°Ÿà°² వరకు  à°ªà°¦à°¿ నిమిషాలు, 15 నిమిషాలు, à°…à°°à°—à°‚à°Ÿ కచేరీలు ఐదు

రోజులపాటు జరుగుతాయి. à°ˆ ఉత్సవాలలో గాత్ర వాద్య కచేరీలే కాకుండా,  à°…à°°à°—à°‚à°Ÿ సేపు నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది .

హనుమాన్ ఆరాధనతో ముగింపు: . .

.

జనవరి 15 న ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు ఆఖరి రోజు అంటే 19వ తారీఖున బ్రహ్మశ్రీ ఐ వి ఎల్ శాస్త్రి గారి కచ్చేరి అనంతరం హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుంది. 108 వడలతో చేసిన

వడమాలను పంచముఖ ఆంజనేయ స్వామికి సమర్పించి,  à°®à°‚త్రపుష్పం ,చతుర్వేద పారాయణ తర్వాత ఆశీర్వాద స్వస్తి వచనాలతో ఆరు రోజుల త్యాగరాజస్వామి వర్ధంతి ఉత్సవాలు

ముగుస్తాయి .

దరఖాస్తుల వెల్లువ : . . .

à°ˆ సంవత్సరం మొత్తం  901 దరఖాస్తులు రాగా సమయాభావం వల్ల కేవలం 862 మంది దరఖాస్తుదారులకు మాత్రమే అవకాశం ఇవ్వగలిగించినట్టు

తెలిపారు.  à°‡à°‚దులో పక్క వాయిద్యాలు  à°®à±€à°¦ 27 మంది , వయొలిన్ పై 39 మంది సహకరిస్తున్నారు.

ఈ ఏడాది కచేరీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే

 à°•à°¾à°•à±à°‚à°¡à°¾ అమెరికా, అట్లాంటా, మేరీల్యాండ్, చెన్నై, బెంగుళూరు, మంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఏలూరు, నూజివీడు, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది

కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

ఉత్సవాల ఆఖరు రోజున ఆదివారం ( జనవరి 19 న ) సాయంత్రం 4 :30 గంటలకు కళాభారతి కార్యరదర్శి గుమ్ములూరి రాంబాబు 15 నిమిషాల విభాగం

లో గాత్ర కచేరి చేయనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam