DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19వ తేదీన పల్స్ పోలియో ను విజయవంతం చేయాలి

జిల్లాలో 4 లక్షల 47 వేలమంది బాలలు లక్ష్యం

3786 పల్స్ పోలియో బూత్ లు ఏర్పాటు నెంబర్ 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿à°°à°¾à°µà±

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS

, బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 19à°µ తేదీన జిల్లాలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విశాఖపట్నం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్. తిరుపతి రావు వివిధ శాఖల అధికారులను కోరారు. శుక్రవారం తమ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన

మాట్లాడుతూ పోలియో క్రిములు ఉద్భవించే గొలుసును అరికట్టేందుకు దేశవ్యాప్తంగా జనవరి 19వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా మునిసిపల్, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, రవాణా, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి

చేస్తామన్నారు. జిల్లాలో 4 లక్షల 47 వేల 264 మంది 5 సంవత్సరముల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉంటుందని గుర్తించామన్నారు.  à°µà±€à°°à°¿à°²à±‹ 1,92,816 మంది గ్రామీణ ప్రాంతంలో, 1,68,932

మంది నగర ప్రాంతంలో ఉండగా గిరిజన ప్రాంతంలో 85,516 మంది బాలలకు పోలియో చుక్కలు వేసేందుకు సిద్ధం చేశామన్నారు. 3786  à°¬à±‚త్ లలో 7 99 గ్రామీణ ప్రాంతంలో 13 44 గిరిజన ప్రాంతంలో 643

కేంద్రాలు నగర ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. 144 మంది సిబ్బంది 379 మంది సూపర్వైజర్లు 53 36 మంది ఆశావర్కర్లు పని చేస్తారన్నారు 123 సంచార బూత్ లు, 168 సంచార బృందాలు 145 గోల్డ్

చైన్ యూనిట్లు పని చేస్తాయన్నారు. 

వైద్య ఆరోగ్య సిబ్బంది తో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థల వాలంటీర్లు ఆశా, అంగన్వాడి కార్యకర్తలు ప్రతి బూత్ లో  à°¸à°¹à°•à°¾à°°à°¾à°²à±

అందిస్తారన్నారు. తగిన వసతి సౌకర్యం కల్పించేందుకు పట్టణాలలో మునిసిపల్, గ్రామాలలో వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు సహకరించేందుకు సంబంధిత అధికారులు ఆదేశించ

వలసిందిగా కోరారు. ఆంధ్ర వైద్య కళాశాల,  à°…వసరమైన నిపుణులను పంపించవలసిన దిగా జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్, కింగ్ జార్జి ఆసుపత్రి వారు  à°¸à°¹à°•à°°à°¿à°‚à°š వలసిందిగా

కోరారు. ఆర్టీసీ బస్సులలో, బస్టాండ్ లలో పల్స్ పోలియో నిర్వహించేందుకు అనుమతించాలన్నారు. 

ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ పథక సంచాలకులు వి. విశ్వేశ్వరరావు, స్త్రీ

శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు సీతా మహాలక్ష్మి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డా. కే ఎల్ ఎస్ జి శాస్త్రి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.జీవన్ రాణి, విద్యాశాఖ

సహాయ సంచాలకులు జ్యోతి కుమారి విద్యుత్ శాఖ ఈ ఈ రమణ మూర్తి, డాక్టర్ సూర్య నారాయణ, డాక్టర్ భవాని తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam