DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్ళు 

సేకరించిన భూమిలో లేఅవుట్ల ప్రక్రియ కొనసాగాలి

ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించవచ్చు

ప్రభుత్వ పరిధిలో నిరుపయోగ భూములను

గుర్తించండి

సీసిఎల్ఏ స్పెషల్ కమిషనర్ హరి నారాయణన్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .. 

విశాఖపట్నం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±‡à°¦à°²à°‚దరికీ

ఇల్లు  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో అర్హులైన పేద వారందరికీ ఉగాది నాటికి ఇంటి స్థలం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రత్యేక కమిషనర్ హరి నారాయణన్ అధికారులను

ఆదేశించారు. శనివారం విశాఖపట్నం జిల్లా  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయ సమావేశ మందిరంలో  à°¸à°®à±€à°•à±à°· సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో భూములను, భూమి రికార్డులను,

వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నిశితంగా గమనించినట్లయితే గ్రామాలలో అవసరానికి మించి భూమి లభిస్తుందన్నారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో

మాత్రమే ఇబ్బందులు ఉంటాయి అన్నారు. ఒక గ్రామానికి సంబంధించి 2 కి.మీ. పరిధిలో, పురపాలక సంఘానికి 7 కి.మీ. ల దూరంలో ఇళ్ల పట్టాల కు స్థలాలను చూడవచ్చు అన్నారు. అనుభవంలో

ఉన్న డి పట్టా కు కూడా నష్టపరిహారం ఇవ్వవలసి ఉన్నందున పూర్తిస్థాయి ప్రభుత్వ భూమికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పరిశీలనలో అనుసరించవలసిన

నియమ నిబంధనలను ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఆధార్ కార్డు, హౌసింగ్ డేటా, ఓటర్ లిస్టు పరిశీలించాలన్నారు. భూమి లభ్యత, ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భూమి

అయి ఉండాలన్నారు. ప్రజలందరికీ మేలు చేకూర్చే కార్యక్రమం కనుక తాసిల్దార్ లందరూ మంచి సంకల్పంతో పని చేయాలన్నారు. భూమి సేకరించిన వెంటనే చదును చేసి విభాగాలుగా

విడదీసి ఇళ్ల స్థలాలను లేఅవుట్ లాగా తయారు చేయాలన్నారు. మార్కింగ్ చేసి సరి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను

కేటాయించాలని ఆదేశించారు. విశాఖ నగరంలో ప్రభుత్వ భూమి తక్కువగా ఉన్నందున నగరం చుట్టుపక్కల ఉన్న పది మండలాలలో మండలాలలో భూమిని సేకరించి వి ఎం ఆర్ డి ఎ ద్వారా

ల్యాండ్ పూలింగ్ పద్ధతిపై కాలనీలను నిర్మించనున్నట్లు తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరావు మాట్లాడుతూ విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో పట్టణ

ప్రాంతాలలో ప్రభుత్వ భూమి లభ్యత తక్కువగా ఉన్నదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేదని పేర్కొన్నారు. మరింత క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత వరకు ప్రభుత్వం

దగ్గర ఉన్న,  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ చెందిన భూమిని లబ్ధిదారుల సంఖ్య తో సరిచూసి అవసరమైతే ఆయా గ్రామాలకు సమీప గ్రామాలలో స్థలాలను తీసుకోవడం జరుగుతుందన్నారు.

తాసిల్దార్లు మండలంలోని ప్రతి గ్రామాన్ని స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
 à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ నర్సీపట్నంలో

ప్రభుత్వ భూమి లభ్యత తక్కువగా ఉన్నందున పక్క గ్రామం లేదా మండలంలో పరిశీలిస్తామని వీలైనంతవరకు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను మరియొక సారి పరిశీలిస్తామని

తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు పెంచల కిషోర్, సీతారామారావు, గృహ నిర్మాణ శాఖ జిల్లా మేనేజర్ జయ రామాచారి, పిడి డ్వామా సందీప్, టిట్కో ఎస్. ఇ.

సిహెచ్.వి.కే. కుమార్, జిల్లాలోని తాసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam