DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న అరుంధతి సర్కార్ కు సంగీత కళా భారతి పురస్కారం 

సంగీత సరస్వతి సత్కారం తో త్యాగరాజ ఆరాధనలు ప్రారంభం. 

12 మృదంగాలతో వెంకట్రావ్ బృందం లయ విన్యాసం  

15 నుంచి విశాఖ లో త్యాగరాజ ఆరాధన ఉత్సవ కచేరీలు

 

విశాఖ వేదికగా త్యాగరాజ ఆరాధనలో 802  à°•à°šà±‡à°°à±€à°²à±

కళాభారతి వేదిక గా వందలాది మంది తో సంగీత నీరాజనం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

విశాఖపట్నం, జనవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : కర్ణాటక శాస్త్రీయ సంగీత కళానిధి సద్గురు త్యాగరాజ స్వామికి విశాఖ నగరం వేదికగా ఉత్తరాంధ్రా సంగీత కళాకారులు సంగీత

నీరాజనం అందించనున్నారు. త్యాగరాజ స్వామికి నివాళి అర్పించేందుకు కళాభారతి కళా ప్రాంగణం కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) తెలిపారు. ఆదివారం విశాఖపట్నం

లోని మద్దిలపాలెం లో గల కళాభారతి సభ ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వందలాది మంది సంగీత విద్వాంసులు

సిద్దపడుతున్నట్టు తెలిపారు. à°ˆ ఆరు రోజుల ఉత్సవాలు త్యాగరాజ ఆరాధన సమితి, విశాఖపట్నం, కళాభారతి కళా ప్రాంగణం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  
à°ˆ

ఉత్సవాలకు ముందుగా ప్రముఖ సంగీత కళాకారులూ, సంగీత సరస్వతికి ఎనలేని సేవలు చేసిన ప్రముఖ కళాకారులను సత్కరించుకుని, వారికి సంగీత సరస్వతి పురస్కారం తో సముచిత

రీతిన గౌరవించడం ఆనవాయితీ వస్తుందని వివరించారు.  à°ˆ నెల 15 నుంచి ఆరంభమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతున్నా సంగీత నీరాజన కార్యక్రమానికి శ్రీకారం

à°—à°¾ ఒక్క రోజు ముందుగా ఈనెల 14 à°¨ ప్రముఖ సంగీత కళాకారిణి 
అరుంధతి సర్కార్ కు సంగీత కళా భారతి పురస్కారం అందింస్తున్నట్టు తెలిపారు. అనంతరం అదే వేదిక పై విశాఖ కు

చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు వెంకట్రావు నేతృత్వం లోని బృందం 12 మృదంగాలతో లయ విన్యాసం జరుగుతుందన్నారు.  

ఈ నెల 15 నుంచి ఐదు రోజుల పాటు (19 వరకు) విశాఖ

మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సహకారం తో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో విశాఖ నగరం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి కళా ప్రాంగణం లో త్యాగరాజ

ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.  à°ˆ మేరకు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి ప్రాంగణం లో నిర్వాహకులు నిర్వహించిన విలేకరుల.

సమావేశం లో వీఎండీఏ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) మాట్లాడుతూ  à°µà°‚దలాది మంది వర్ధమాన సంగీత కళాకారుల నుంచి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రసిద్ధ కళాకారులు

ఇదే వేదికపై గాత్ర కచేరీలు, వీణ కచేరీలు, వయోలిన్ కచేరీలు చేయనున్నారని తెలిపారు. à°ˆ ఉత్సవాల్లో మొత్తం ఏ హై గ్రేడ్ విద్వాంసులు 12 మంది, బి  à°¹à±ˆ గ్రేడ్ విద్వాంసులు 23

మంది, బి గ్రేడ్ విద్వాంసులు 10 మంది పాల్గొంటున్నారన్నారు. 

తిరువీధి శోభాయాత్ర :
 
జనవరి 15 , 2020 పుష్య బహుళ పంచమి నాడు కళాభారతి లో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయంలో

విశేష పూజలు చేసి ఏడున్నర à°—à°‚à°Ÿà°² నుంచి 8 :15 వరకు సీతా రామ లక్ష్మణ à°­à°°à°¤ శత్రుఘ్న హనుమత్  à°µà°¿à°—్రహాలను పల్లకిపై అలంకరించి, 150 à°•à°¿ పైగా కళాకారులు  à°•à°³à°¾à°­à°¾à°°à°¤à°¿ చుట్టూ ఉన్న మాడ

వీధులలో త్యాగరాజ కీర్తనలు గానం చేస్తూ ఉండగా, కళాభారతి కార్యదర్శి రాంబాబు త్యాగరాజ వేషధారణలో ఊంఛ వృత్తి చేస్తూ ఉండగా, శోభాయాత్ర తిరువీధి ఉత్సవం

సాగుతుంది.

పంచరత్న సేవ : 

ఉదయం 8:15 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనం గావించి 250 మంది కళాకారులు త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతులను బృందగానం చేస్తారు. అనంతరం

గురువుల అప్పన్న నాదస్వర కచేరి తో ప్రారంభమై రాత్రి 9:30 à°—à°‚à°Ÿà°² వరకు  à°ªà°¦à°¿ నిమిషాలు, 15 నిమిషాలు, à°…à°°à°—à°‚à°Ÿ కచేరీలు ఐదు రోజులపాటు జరుగుతాయి. à°ˆ ఉత్సవాలలో గాత్ర వాద్య కచేరీలే

కాకుండా,  à°…à°°à°—à°‚à°Ÿ సేపు నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది .

హనుమాన్ ఆరాధనతో ముగింపు:

జనవరి 15 న ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు ఆఖరి రోజు అంటే 19వ తారీఖున

బ్రహ్మశ్రీ ఐ వి ఎల్ శాస్త్రి గారి కచ్చేరి అనంతరం హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుంది. 108 వడలతో చేసిన వడమాలను పంచముఖ ఆంజనేయ స్వామికి సమర్పించి,  à°®à°‚త్రపుష్పం

,చతుర్వేద పారాయణ తర్వాత ఆశీర్వాద స్వస్తి వచనాలతో ఆరు రోజుల త్యాగరాజస్వామి వర్ధంతి ఉత్సవాలు ముగుస్తాయి .

దరఖాస్తుల వెల్లువ : 

à°ˆ సంవత్సరం మొత్తం  901

దరఖాస్తులు రాగా సమయాభావం వల్ల కేవలం 862 మంది దరఖాస్తుదారులకు మాత్రమే అవకాశం ఇవ్వగలిగించినట్టు తెలిపారు.  à°‡à°‚దులో పక్క వాయిద్యాలు  à°®à±€à°¦ 27 మంది , వయొలిన్ పై 39 మంది

సహకరిస్తున్నారు.

à°ˆ ఏడాది కచేరీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే  à°•à°¾à°•à±à°‚à°¡à°¾ అమెరికా, అట్లాంటా, మేరీల్యాండ్, చెన్నై, బెంగుళూరు, మంగళూరు,

హైదరాబాద్, సికింద్రాబాద్, ఏలూరు, నూజివీడు, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

ఉత్సవాల ఆఖరు రోజున ఆదివారం (

జనవరి 19 à°¨ ) సాయంత్రం 4 :30 గంటలకు కళాభారతి కార్యరదర్శి గుమ్ములూరి రాంబాబు 15 నిమిషాల విభాగం లో గాత్ర కచేరి చేయనున్నారు.   

ఈ విలేకరుల సమావేశంలో కళాభారతి

వ్యవస్థాపక అధ్యక్షులు పిఎస్సెన్  à°°à°¾à°œà±, ప్రస్తుత అధ్యక్షులు రాజు, త్యాగరాజ ఉత్సవాల కళాకారుల ఎంపిక కమిటీ చైర్మన్ పంతుల గోపాల రావు, ఇతర సభ్యులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam