DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు స్థలంలోకి మఫ్టీలో చొరబడిన పోలీసు - బంధించిన రైతులు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  12, 2020 (డిఎన్‌ఎస్‌) : అమరావతి రాజధాని గ్రామం మందడంలో రైతులు తమ సొంత స్థలంలో దీక్ష చేస్తుంటే. . .à°’à°•

పోలీసు మఫ్టీ లో ఆ స్థలంలోకి చొరబడడంతో రైతులు బందించేసారు. మందడం గ్రామంలో ఓ ప్రైవేటు స్థలంలో రైతులు దీక్ష చేస్తుండగా, వారిని గమనించడానికి ఓ పోలీసు

ఇంటెలిజెన్స్ అధికారి మఫ్టీలో అక్కడకు చేరుకున్నారు. తాను పోలీసునని చెప్పకుండా దీక్షాస్థలంలోకి వెళ్లి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. దీన్ని పసిగట్టిన

రైతులు.. ఆ అధికారి వెనుదిరిగి వెళ్లేప్పుడు ఆయన్ను అడ్డగించారు. బయటకు వెళ్లడానికి వీల్లేకుండా గేట్లు మూసివేశారు. దీంతో ఎటూ పాలపోని సదరు అధికారి అడ్డంగా

దొరికిపోయారు. à°†à°¯à°¨ కోసం వచ్చిన పోలీసులను గేటు వద్దే రైతులు అడ్డగించారు. ప్రైవేటు స్థలంలోకి అనుమతి లేకుండా ఎందుకొచ్చారని రైతులు పోలీసులను నిలదీస్తున్నారు.

తమ అధికారిని బయటకు పంపించాలని వారు కోరగా, అలా చేయడం కుదరదని రైతులు తేల్చిచెప్పారు. దీంతో తమ ఆఫీసర్ కోసం పోలీసులు మూసేసిన గేటు వద్దే నిరీక్షిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam