DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యాచరణ ?

ఏప్రిల్ 1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యాచరణ ? ?

సికిందరాబాద్, భువనేశ్వర్ నుంచి విశాఖ కు తరలింపు ??

ఉద్యోగులకు నో ఆప్షన్ -10 వేల మందీ వైజాగ్

వెళ్లాల్సిందే. . . . . . 

20 తర్వాత విశాఖ కు రానున్న రైల్వే ఉన్నతాధికారులు,   

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, జనవరి  14, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని. 1 ఏప్రిల్ 2020 నుంచి ఆ కల పరిపూర్ణం కానుంది. విశాఖపట్నం కేంద్రంగా

దక్షిణ కోస్తా రైల్వే కార్యాచరణ ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వే ( సికేంద్రాబాద్) పరిధిలోని రైల్వే కార్యాలయాలు, తూర్పు కోస్తా రైల్వే ( భుబనేశ్వర్)

పరిధిలోని కార్యాలయాలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ( విశాఖపట్నం) పరిధిలోకి రానున్నాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది

ఏప్రిల్ నుంచి విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ విశాఖ నుంచే పనిచెయ్యాలని ఆదేశించినట్టు రైల్వే వర్గాలు

తెలియచేస్తున్నాయి. 

ఇటీవల విశాఖపట్నం దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటైంది. ఈ జోన్ కిందకు వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ... ఏప్రిల్ నుంచీ ఇదే జోన్ కింద

పనిచేస్తాయి. అప్పుడిక సికింద్రాబాద్ రైల్వే ఈ కార్యకలాపాలతో సంబంధం ఉండదు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా  à°†à°‚ధ్ర ప్రదేశ్

పరిధిలోని రైల్వే ప్రాంతాలన్నీ ఒకే రైల్వే జోన్ పరిధిలో ఉండేలా కేంద్రం ఆమోదించి, దక్షిణ కోస్త రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. దీనికోసం దక్షిణ మధ్య రైల్వే జోన్‌

పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని విశాఖపట్నం డివిజన్ ను ఏకం చేసారు.  

విశాఖలో ఆఫీసులు, మౌలిక వసతుల కోసం

కేంద్రం రూ.120 కోట్లు ఇచ్చింది. తాజాగా వెంటనే ఉద్యోగుల్ని సికింద్రాబాద్ నుంచీ వైజాగ్ తరలించాలని సూచించింది. ఎవరైనా ఉద్యోగులు అలా వెళ్లడానికి ఇష్టపడకపోతే...

బలవంతంగా కూడా పంపించాలని చెప్పింది. 

ఉద్యోగులకు నో ఆప్షన్ - వైజాగ్ వెళ్లాల్సిందే. . . . . . 

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 20 వేల మందికి పైగా

ఉద్యోగులు ఉన్నారు. వాళ్లలో 10 వేల మంది విశాఖకు తరలి వెళ్లాల్సిందే. ఈ విషయంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదంటు ఆదేశాలు వాచినట్టు

తెలుస్తోంది. అందరూ తరలిపోవాల్సిందే. పిల్లల విద్యా సంవత్సరం పూర్తయ్యేదాకా ఉండి... అప్పుడు వెళ్తామని అంటే కుదరదు. ఇప్పుడే వెళ్లిపోవాలన్నమాట. విశాఖలో

తాత్కాలిక ఆఫీసుల్ని ఎక్కడెక్కడ ఎంపిక చెయ్యాలో డిసైడ్ చేసుకునేందుకు... కొంత మంది సీనియర్ అధికారులు... ఈ నెల 20 తర్వాత సికింద్రాబాద్ నుంచీ వైజాగ్

వెళ్లబోతున్నారు. వాళ్లు డిసైడ్ చేసేందుకు ఓ 10 రోజులైనా పడుతుంది. ఆ తర్వాత మరో నెల రోజులపాటూ... ఇతరత్రా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే... మార్చిలో ఉద్యోగుల తరలింపు

జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam