DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిహెచ్ పీవీ ఆలయంలో వైభవంగా నమ్మాళ్వార్ల పరమపదోత్సవం. 

బిహెచ్ పీవీ ఆలయంలో వైభవంగా నమ్మాళ్వార్ల పరమపదోత్సవం. 

పరమపదానికి  à°œà±€à°µà±à°¡à± చేరే మార్గాన్ని సందర్శింప చేసారు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం): . . . .  

విశాఖపట్నం, జనవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లోని బిహెచ్ పీవీ లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కాండూరి

జగన్నాధాచార్యుల అద్య్వర్యవంలో నమ్మాళ్వార్ల పరమపదోత్సవం బుధ వారం రాత్రి వైభవంగా జరిగింది. దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ, దాని వివరణ అందించారు. ఒక జీవుడు

మరణానంతరం ఈ భౌతిక దేహాన్ని వీడి పరమ పదానికి ఏ విధంగా చేరుకుంటాడు అనేది భక్తులందరికీ తెలియచేసేందుకు ఆయా మార్గాల నమూనాలను కూడా తయారు చేసారు. దీనిలో 1

అర్చరాది లోకం, 2 పూర్వ పక్షం, 3 షడ్ డంగ్ లోకం,4 మాశాబ్ద లోకం, 5 వాతాంశుమత్ లోకం,6 గ్లౌర్ లోకం,7 విద్యుత్ లోకం, 8 వరుణ లోకం, 9 ఇంద్ర లోకం, 10 దాతృ లోకం  à°¤à°¦à°¿à°¤à°° లోకాలు దాటుకుని

పరమపదానికి చేరుకుంటాడని తెలియచేసారు. à°ˆ  à°‰à°¤à±à°¸à°µ వేడుకల్లో పెద్దలకు గురుస్థానం లో కూర్చోబెట్టి, పెరివెట్టం కట్టి సమ్మానించి, వారి నేతృత్వంలో

పరమపదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం లో అర్చక బృందం  à°—ుంటూరు సీతారాం, లక్ష్మణ్, శ్రీరామ్, రామానుజం  à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో భక్తులు

పాల్గొన్నారు. 

నమ్మాళ్వార్ల జీవన వైభవం : . . .

విశిష్టాద్వైత సిద్ధాంతం లో à°…త్యంత ప్రముఖ స్థానం కలిగినవారిలో ఆళ్వార్లు ప్రఖ్యాతి గాంచినవారు. మొత్తం 12

మంది ఆళ్వార్లలోనూ నమ్మాళ్వార్లు అనే వారు శ్రీ వైకుంఠవాసుని సైన్యాధ్యక్షులు విష్వక్సేనుల అంశం లో అవతరించినవారు. వారు చిన్న నాటి నుంచి కనీసం నోరు మెదపకుండా

వారికి 16 ఏళ్ళ వయసు వచ్చేవరకూ మౌనంగానే ధ్యానం చేసుకునేవారు. విశిష్టాద్వైత సిద్ధాంతం లో వారు అందించిన నాలాయిర దివ్య ప్రబంధం (4 వేల శ్లోకములు) ఈ ప్రపంచంలో

అవతరించిన శ్రీమన్నారాయణుని అవతార వైశిష్ట్యాన్ని తెలియచేసింది. అదే ప్రబంధం  à°¨à±‡à°¡à± అన్ని శ్రీవైష్ణవ ఆలయాల్లోనూ అన్ని పర్వదినోత్సవాలు, వేడుకల్లోనూ

వేదపండితులు పఠనం చేస్తుంటారు. తమిళనాడు లోని శ్రీరంగం,  à°†à°‚ధ్ర ప్రదేశ్ లోని తిరుమల శ్రీనివాసుని ఆలయాల్లో à°ˆ ప్రబంధ పఠనం సాక్షాత్తు సంస్థాన జీయర్ స్వాముల

ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగుతుంది. వారు అందించిన ఈ ప్రబంధం పూర్తిగా అనుసంధానం చేసిన వారికి ఆళ్వార్ల అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అన్నది అక్షర సత్యం.

అలాంటి నమ్మాళ్వార్లు ఈ మార్గశిర మాసంలోనే పరమపదానికి వేంచేయడం జరిగింది. ఆ మహోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం

జరుపుతుంటారు. à°’à°• జీవుడు మరణానంతరం పరమపదానికి వేంచేసే ప్రక్రియను తెలియచేస్తూ ఆలయాల్లో నమ్మాళ్వార్ల పరమపదోత్సవం జరుపుతుంటారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam