DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 ఏళ్ళ చిన్నారికి అత్యాధునిక వినికిడి పరికరం పంపిణీ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) :  4 ఏళ్ళ చిన్నారికి అత్యాధునిక వినికిడి పరికరంను శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్ జె నివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. నరసన్నపేట మండలం రెళ్లివలసకు చెందిన 4 ఏళ్ళ బాలుడు పి.గురు చరణ్. పుట్టుకతోనే వినికిడి శక్తి తక్కువ. తద్వారా

మాట్లాడే పరిస్థితి కూడా లేకపోయింది.  à°¤à°²à±à°²à°¿ వసుంధర వైద్యుల వద్ద వైద్య పరీక్షలు చేయించారు. హై పవర్ హియరింగ్ పరికరం పెట్టడం వలన వినికిడి శక్తి పెరిగి మాటలు

వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. 50 వేల రూపాయలకు పైగా ఖరీదు చేసే పరికరం కొనుగోలు చేయడం ఆ పేద కుటుంబానికి ఎంతో బరువుతో కూడుకున్నది. జిల్లా కలెక్టర్ కు

స్పందన కార్యక్రమంలో తమ గోడు వినిపించారు. కలెక్టర్ తక్షణం స్పందించి హై పవర్ హియరింగ్ పరికరం కొనుగోలు చేసి సరఫరా చేయాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ

సంచాలకులు జీవన్ బాబుని ఆదేశించారు. సహాయ సంచాలకులు రూ.59,500 తో  à°•à±Šà°¨à±à°—ోలు చేసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురు చరణ్ కు పంపిణీ చేశారు. పరికరాన్ని

సక్రమంగా ఉపయోగించి చరణ్ భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ చరణ్ తల్లిని కోరారు. హై పవర్ హియరింగ్ పరికరం లభించి నందున విశాఖలో వైద్యులకు చూపించి తగు చర్యలు

తీసుకుంటామని చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam