DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 8న జాతీయ లోక్ అదాలత్: జెసి శ్రీనివాసులు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌): జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 8à°µ తేదీన నిర్వహించడం

జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ నోడల్ అధికారి డా.కె.శ్రీనివాసులు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ

లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా స్ధాయిలో జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతుందని చెప్పారు. ఈ లోక్ దాలత్ లో పరిష్కారానికి అర్హమైన కేసులను గుర్తించి వాటి వివరాలను ఈ

నెల 20వ తేదీ లోగా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధకు సమర్పించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు,

నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటు చట్టంలో  à°¸à±†à°•à±à°·à°¨à± 138 క్రింద వచ్చే కేసులు, బ్యాంకు రికవరి, మోటారు వాహనాల కేసులు (à°Žà°‚.à°Ž.సి.à°Ÿà°¿ కేసులు), వివాహ సంబంధిత కేసులు

(మేట్రిమోనియల్), కార్మిక వివాద కేసులు (లేబర్ డిస్ప్యూట్ కేసులు), భూ సేకరణ కేసులు, ఎలక్ట్రిసిటి అండ్ వాటర్ బిల్లుల కేసులు (దొంగతనం కేసులు మినహా), పే అండ్

అలవెన్సెస్ తదితర ఉద్యోగ సర్వీసులకు సంబంధించి పరిష్కారం కావలసిన కేసులు, రెవిన్యూ కేసులు., అద్దె, ఇంజెక్షన్ సూట్, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్సు సూట్, తదితర

సివిల్ కేసులు., పరిష్కారం కోసం చూసే ఏవేని ఇతర కేసుల వివరాలను సమర్పించి ఫిబ్రవరి 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

సంబంధిత కేసుల వివరాలను విధిగా 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam