DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీబీఐ కోర్టులో జగన్ కేసు జనవరి- 24కు వాయిదా

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక

కోర్టు కేసును జనవరి- 24కు వాయిదా వేసింది. శుక్రవారం జరిగిన కార్యాచరణలో వైఎస్ జగన్ కు కోర్టులో చుక్కెదురైంది.  à°¸à±€à°¬à±€à° విచారణ పూర్తయ్యేంతవరకు ఈడీ విచారణ చేపట్ట

రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం

తిరస్కరించింది. కాగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చేవారానికి కోర్టు వాయిదా పడింది. à°ˆ కేసులో à°ˆ వారానికి జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయంపు

ఇచ్చింది. దీని కోసం జగన్ ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి,

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

 à°œà°—న్ తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి

ఉండగా ఏపీకి సీఎం అయిన తర్వాత అధికారిక, ఇతరాత్ర కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసులో

వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని à°† పిటిషన్‌లో కోరారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు

à°—à°¤ వారం పూర్తయ్యాయి. కాగా ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు

విచారణ ఈనెల 24కు వాయిదాపడడంతో జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam