DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు కె ఫిక్స్ అయ్యారు, ఆమోద ముద్రే ఆలస్యం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ పై ఫోకస్ పెట్టింది వైఎస్ జగన్ సర్కార్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

రెడ్డితో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు. మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశం షెడ్యూల్ రెండు సార్లు

మారింది. సీఆర్డీఏ రద్దును మనీ బిల్లుగా పెట్టాలని మొదట భావించింది ప్రభుత్వం.. అయితే, ప్రస్తుతం సీఆర్డీఏ రద్దుకు మనీ బిల్లు పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు

న్యాయనిపుణులు. కాగా, 20వ తేదీన ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమైన తర్వాత ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని మొదట భావించారు. కానీ, న్యాయపరమైన

చిక్కులు రాకుండా.. కేబినెట్ సమావేశానికి ఇవాళ్టి మధ్యాహ్నానికి మారుస్తూ ఆకస్మిక ఆదేశాలు శుక్రవారం సాయంత్రం అందాయి.. మళ్లీ రాత్రి 9 గంటల సమయంలో యథావిథిగా 20నే

కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటించింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా.. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు

ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam