DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రథ సప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ యంత్రాంగం 

అరసవల్లి లో కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి సమీక్ష 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) :

అరసవల్లిలో ఫిబ్రవరి 1వ తేదీన జరిగే రథ సప్తమి వేడుకల ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శని

వారం పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, వచ్చే భక్తులకు సౌకర్యాలు, పార్కింగు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులు ఆలయ పరిసరాల్లోకి రావడం, స్వామి వారిని

సందర్శించుకుని బయటకు వెళ్ళడం వరకు జరిగే ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ భక్తులు ప్రశాంతంగా దైవ దర్శనం

చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎటువంటి అసౌకర్యం కలుగకుండా

భక్తిశ్రద్దలతో దైవదర్శనం కలిగే విధంగ ఉండాలనే ఆలోచనతో ఉన్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన రథ సప్తమి కార్యక్రమం ఉండగా ముందు రోజు అనగా జనవరి 31వ తేదీ

అర్ధరాత్రి 12.30 గంటల నుండి రథ సప్తమి పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని అన్నారు. అర్థ రాత్రి నుండే భక్తుల తాకిడి ప్రారంభం అవుతుందని అందుకు తగిన విధంగా

ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. విఐపి, 5 వందల రూపాయల టికెట్, వంద రూపాయల టికెట్, విరాళాలు అందించిన కుటుంబాలు, ఉచిత దర్శనం లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని

అన్నారు. ప్రధాన ద్వారం వద్ద నుండే వి.ఐ.పి, 5 వందల రూపాయల టికెట్ల దర్శనానికి లైన్లు ఉండే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. 5 వందల రూపాయల టికెట్లు క్యూ లైన్ లోనే

ఎప్పటి వలే విక్రయాలు చేస్తారని చెప్పారు. ఉచిత దర్శనంకు వచ్చే భక్తులకు అరసవల్లి తోట నుండి పుష్కరిణి గుండా క్యూ లైను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత

లైన్లలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. తాగునీరు, పులిహోర ప్యాకెట్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో  à°ªà°‚పిణీ జరుగుతుందని వివరించారు. పార్కింగ్,

పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పోలీసు శాఖ సమన్వయం చేస్తుందని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అందుకు భక్తులు సహకారం

అందించాలని కోరారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ఐదు వైద్య శిబిరాలు ఉంటాయని అందులో రెండు గుడి లోపల ఉంటాయని, మూడు బయట ఉంటాయని చెప్పారు. అగ్నిమాపక శాఖ రిస్క్యూ బోటు, గజ

ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఇపిడిసిఎల్ అధికారులను ఆదేశించారు.

పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

మాట్లాడుతూ జనవరి 31 నుండి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. సిసి కెమెరాలు ఏర్పాటు

చేసి పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానంకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, ఆర్డీవో ఎం.వి.రమణ, ఆలయ ఇఓ వి.హరి సూర్య

ప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, డిఎస్పీలు సిహెచ్ జివి ప్రసాద్, డిఎస్ఆర్విఎస్ఎన్ మూర్తి, ఇపిడిసియల్ ఎస్ఇ ఎన్. రమేష్, డిఇ పాత్రుడు, డిఎంహెచ్ఓ

à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య, మత్స్య శాఖ జెడి à°¡à°¾.వి.వి.కృష్ణ మూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్ à°Žà°‚.గీతాదేవి, అర్ అండ్ బి à°¡à°¿à°‡ గణపతి,  à°œà°²à°µà°¨à°°à±à°² శాఖ à°¡à°¿à°‡ గనిరాజు, అగ్నిమాపక శాఖ

ఇన్స్పెక్టర్ శ్రీనుబాబు, ప్రజా రవాణా శాఖ డిప్యూటి సిటిఎం జి.వరలక్ష్మి, పీఆర్ఓ బి.ఎల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam