DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలియోరహిత జిల్లాగా రూపొందించాలి: ఎం.చెంచయ్య

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : పోలియో రహిత జిల్లాగా రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని

శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.   శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమంపై

పత్రికా సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా à°¡à°¿.à°Žà°‚.అండ్.హెచ్.à°“. మాట్లాడుతూ, పల్స్ పోలియో కార్యక్రమం మన దేశంలో 1995 డిశంబరు 19 à°¨ ప్రారంభమైనదని తెలిపారు. నేడు

 à°ªà±‚ర్తిగా పోలియో వ్యాధి నిర్మూలన జరిగినా, పాకిస్థాన్, ఆఫ్ఘన్ స్థాన్ దేశాలలో ఇంకా పోలియోవ్యాధి కనిపిస్తున్నదని తెలిపారు.  à°¸à°°à°¿à°¹à°¦à±à°¦à± దేశాలలో పోలియో వ్యాధి

వుండడం వలన మనం చాలా అప్రమత్తతతో వుండవలసిన పరిస్థితి వుందని చెప్పారు.  à°ˆ నెల 19à°µ తేదీన జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం

జరుగుతున్నదన్నారు.  0  à°¨à±à°‚à°¡à°¿ 5  à°¸à°‚.లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు వేసి వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 à°®à°¨ జిల్లాలో 0 నుండి 5 సం.లలోపు పిల్లలు 2 లక్షల 33 వేల 378 మంది  à°µà±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿, 1616 పోలియో బూత్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8530 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని,  

కార్యక్రమాన్ని పర్యవేక్షించు నిమిత్తం 161 మంది సూపర్ వైజర్లు పని చేస్తారని, 83 మొబైల్ టీమ్ లు, 50 ట్రాన్సిట్ బూత్ లు ఏర్పాటు చేసామన్నారు.   3 లక్షల 40 వేల పోలియో  à°¡à±‹à°¸à±à°²à±

వచ్చాయని, ఎక్కువ మంది సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని చెప్పారు.  à°ªà±‹à°²à°¿à°¯à±‹ చుక్కలు చిన్నారులందరికీ తప్పని సరిగా వేయించాలని,   ముందురోజు వేయించినా కూడా

పల్స్ పోలియో రోజున తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు.  à°ªà±‹à°²à°¿à°¯à±‹ చుక్కలు వేయడం వలన ఎటువంటి ఇబ్బందులు వుండవన్నారు.  à°Ÿà±à°°à°¾à°¨à±à°¸à°¿à°Ÿà± బూత్ à°² ద్వారా అన్ని

రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్సు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, సంతలు, జాతరలలోను, ప్రయాణాలలో వున్న చిన్నారులకు సైతం పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు

చేసామన్నారు.  à°‡à°‚దు నిమిత్తం 50 బృందాలను నియమించామన్నారు. 
  జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాట్లాడుతూ, మన పొరుగు దేశాలలో ఇంకా పోలియో వ్యాధి సోకిన వారు వుండడం

వలన మన దేశానికి  à°µà°²à°¸ దారుల ద్వారా పోలియో సోకే ప్రమాదం వుందన్నారు. జనవరి 19 à°¨ జాతీయ  à°ªà°²à±à°¸à± పోలియో ఇమ్మునైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని,  à°…ప్పుడే

పుట్టిన బిడ్డ నుండి 5 సం.లలోపు పిల్లల వరకు తప్పనిసరిగా అందరికీ  à°ªà±‹à°²à°¿à°¯à±‹ చుక్కలు  à°µà±‡à°¯à°¡à°‚ జరుగుతుందని తెలిపారు.  à°®à°¨ జిల్లాలో సంచార జాతులు, ఇటుక బట్టీ పనివారు,

మత్స్యకార ప్రదేశాలతో కలిపి  249 ప్రాంతాలలో 7,494 మంది పిల్లలను గుర్తించడం  à°œà°°à°¿à°—ిందని, వీరందరికీ మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు.

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ à°—à°²  2,33,378 పిల్లలకు, 3,40,000 పోలియో డోసులను అందుబాటులో వుంచడం జరిగిందని తెలిపారు.  à°…న్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలోను, పోలియో డోసులను  à°…ందుబాటులో వుంచామని

చెప్పారు. స్థానిక శాసన సభ్యుల ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది కూడా కార్యక్రమంలో

పాల్గొంటారని చెప్పారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ విజయవంతంగా నిర్వహించి పోలియో రహిత జిల్లాగా రూపొందించడానికి అందరూ సహకరించాలని కోరారు.
   à°ˆ కార్యక్రమంలో జిల్లా

ఇమ్యునైజేషన్ అధికారి బి.జగన్నాధ రావు, మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam