DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి : బీసీ సంఘాలు. 

విజయవాడ, జూన్ 22  2018 ( DNS Online ) : సమస్యల పరిష్కారానికై సచివాలయానికి వచ్చిన 
నాయీ బ్రాహ్మణుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా

ప్రవర్తించడంపై తక్షణం క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. 
శుక్రవారం విజయవాడలోని దాసరి భవనంలో జరిగిన బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్వం లో

నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఎన్నికల

ముందు బీసీలంటే ఎక్కడ లేని అభిమానం వచ్ఛేస్తుందని, గెలిచినతర్వాత చారు లో కరివేపాకు లా తీసి పారేస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన

చంద్రబా బు, ఆ విషయాన్ని మరిచి బీసీల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో అందరి తో పాటు విధులు నిర్వహిస్తున్నభక్తులు మొక్కుబడులు

తీర్చే క్షురకులు పట్ల తక్కువ భావం చూపిస్తూ వీరికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని తేల్చడం తో పాటు, నిందించడం దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో కె. పార్థసారధి,

జంగా కృష్ణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు ( వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), దోనెపూడి శంకర్‌(సీపీఐ), కుమారస్వామి, బాజీ(బీజేపీ), పలువురు బీసీ సంఘం

నేతలు పాల్గొన్నారు.     

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam