DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైకోర్టు తరలింపు పై తూగో జిల్లా లాయర్ల 3 రోజుల నిరసనలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  19, 2020 (డిఎన్‌ఎస్‌) : హైకోర్టు ను అమరావతి నుంచి కర్నూల్ కు తరలించేస్తే  à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà± బెంచ్ ని తూర్పు

గోదావరి జిల్లాలో పెట్టాలని తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్ చేసారు. à°ˆ హైకోర్టు తరలింపును  à°¨à°¿à°°à°¸à°¿à°¸à±à°¤à±‚ à°ˆ నెల 20

నుంచి మూడు రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు తెలియచేస్తామని à°¡à°¿ ఎన్ ఎస్ కు  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. సోమవారం నుంచి నిర్వహించ తలపెట్టిన కార్యాచరణను ఆయన వివరించారు. 
/> మూడు రాజధానులు పేరుతో ప్రస్తుతం అమరావతి లో ఉన్నటువంటి హైకోర్టును కర్నూలు కు బదిలీ చేసి జుడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ, ఒకవేళ

అమరావతి లో ఉన్నటువంటి హైకోర్టు ని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగినది.

అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షత విడనాడాలని కోరడం

జరిగిందన్నారు.  

తూర్పుగోదావరి జిల్లాలో న్యాయ సంబంధమైన కమిషన్లు, ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 20 , 21, 22 తేదీలలో న్యాయవాదులు అందరూ

ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలుపుతూ కోర్టుకు హాజరుకావాలని జిల్లా న్యాయవాదుల జేఏసీ పిలుపునిచ్చింది. జనవరి 23వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దాపురం

బార్ అసోసియేషన్ లో జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో న్యాయవాదుల జేఏసీ సమావేశం జరుగుతుందని అనంతరం చర్చించి తదుపరి కార్యాచరణ

రూపొందించడం జరుగుతుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam