DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్రా అభివృద్ధి కి కావాల్సింది 50 వేల కోట్ల నిధులు. . . .

ప్రతి నియామకంలోనూ 75 శాతం ఉద్యోగాలు ఉత్తరాంధ్రులకే ఇవ్వాలి. . . 

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చర్చలో ప్రో. కె ఎస్ చలం. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్రా జిల్లాలేనని, à°ˆ ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి à°•à°¿ రూ. 50

వేల కోట్ల నిధులు అని విద్యావేత్త, యూపీఎస్సీ బోర్డు మాజీ సభ్యులు డాక్టర్ కె ఎస్ చలం డిమాండ్ చేసారు. సోమవారం విశాఖపట్నం లోని ఓ హోటల్ లో జరిగిన ఉత్తరాంధ్రా కు

ఏమి కావలి అనే అంశం పై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన చర్చ లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కరువైన అనంతపురం

జిల్లా కంటే అతి తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేవలం ఒక్క విశాఖపట్నం నగరం మాత్రమే కొంత జనసంచారం ఉంది,

అభివ్రిద్ది దిశగా ఒక్క అడుగు వేసిందని, మిగిలిన ప్రాంతాలన్నీ అత్యంత దయనీయ దిశగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలోని సీలేరు, మ్యాచ్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే

నీరే శబరీ తో కలిసి గోదావరి నదిలో కలుస్తున్నాయన్నారు. దీనిద్వారా నే గోదావరీ నదీ ఆధారిత ప్రాంతాల్లోని త్రాగు నీరు, పంటలకు రెండవ పంటల సాగు నీరు

ఇస్తోందన్నారు. 

ప్రతి నియామకంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి :. . .

ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు అన్ని రకాలుగానూ నష్టపోయారని, కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలు జరిపే అన్ని నియమాకాల్లోనూ 75 శాతం ఉద్యోగాలు ఉత్తరాంధ్రా జిల్లాల వాసులకే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ప్రాంతం నుంచి విద్యా, ఉపాధి కోసం లక్షలాది మంది

ఉత్తరాంధ్ర వాసులు హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాలకు, విదేశాలకు సైతం వలస వెళ్ళిపోతున్నారన్నారు. వీటిని తగ్గించాలంటే స్థానికులకు అవకాశం

కల్పించాలని డిమాండ్ చేసారు. 

ఈ చర్చల్లో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు పేడాడ రమణ

కుమారి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam