DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలోనే పరిపాలనా రాజధానికి , క్యాబినెట్ ఆమోదం.

హైకోర్టు. కర్నూలులో, అసెంబ్లీ  à°…మరావతి లోనే 

సీఆర్డీఏ రద్దు.. అమరావతి మెట్రో అథారిటీ ఏర్పాటు. .

రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తాం : . . . .

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర మంత్రిమండలి

ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో మూడు రాజధానులు ఆమోదం తెలిపింది. కమిటీ

ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖ నగరాన్నిఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధానిగా ఆమోదించిందింది. ఇక్కడే రాష్ట్ర సచివాలయం, ఉన్నతాధికారులు (హెచ్ఓడి ) కార్యాలయాలు, రాజ్

భవన్ తదితర ప్రధాన నిర్మాణాలన్నీ ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న అమరావతి లోని మూడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తేల్చింది. అయితే కర్నూల్ లో

హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తాం :. . . 

అమరావతి అభివృద్ధి కోసం ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు

మెరుగైన ప్యాకేజి ఇస్తామని మంత్రిమండలి ప్రకటించింది. భూములు ఇచ్చిన రైతులకి కవులు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు చేస్తున్నట్టు, సీఆర్డీఏ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం

ఆమోదం తెలిపింది. అదేవిధంగా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఏఎంఆర్డిఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలియచేసింది.

రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్లు 2500 నుంచి 5 వేలకు పెంపుదల చేస్తే ఆమోదించింది. ..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam