DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని మహా విశాఖే . . . .

శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టిన రాజధాని బిల్లు 2020 

రాజధాని బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం 

హైకోర్టు. కర్నూలులో, అసెంబ్లీ  à°…మరావతి

లోనే 

సభలో సాగుతున్న వాదోపవాదనలు . . 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . 

అమరావతి, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం

విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. సోమవారం ప్రారంభమైన

శాసన సభలో ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బిల్లు ను ప్రవేశపెట్టారు. విశాఖలోనే పరిపాలనా రాజధాని గానూ, హైకోర్టు ను కర్నూలులోనూ నిర్ణయించడం

జరిగిందని, అయితే చట్టసభలకు రాజధాని గాను, అసెంబ్లీ అమరావతి లోనే కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇంతకూ ముందు వరకూ ఉన్న సీఆర్డీఏ ను రద్దు.. అమరావతి మెట్రో

అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచీ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామని తెలిపారు.  à°ˆ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశ పెట్టారు. దీంతో పాటు సీఆర్డీఏను రద్దు చేస్తూ కూడా సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. 

రాష్ట్రంలో ప్రత్యేకమైన

జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. అభివృద్ధి అనేది వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చట్టసభలకు

రాజధాని అమరావతి అంటూ బుగ్గన ఈ సందర్భంగా తెలిపారు. విశాఖలోనే రాజ్ భవన్, సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే

నిర్వహిస్తామన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను నిర్ణయించామన్నారు. ఇక జ్యుడీషియల్ బాధ్యతలు అన్ని కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా ద్వారా

నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామన్నారు. కర్నూలులో న్యాయపరమైన అన్నిశాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. 

13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ

లక్ష్యమన్నారు మంత్రి బుగ్గన. ప్రాంతీయ అసమానతలు, సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో అశాంతికి దారి తీస్తున్నాయన్నారు.

రాష్ట్ర జనాభాలో వివిధ

వర్గాల మధ్య సమాన అభివృద్ధి లేదన్న అభిప్రాయం ఉందన్నారు బుగ్గన.ప్రజలకు కావాల్సింది అభివృద్ధి భద్రత అన్నారు.  à°ªà±à°°à°œà°²à±†à°µà°°à±‚ రాజభవనాలు కోరుకోరన్నారు. ఆంధ్రా అనే

పదమే పాత పదమన్నారు. ఆంధ్రా తర్వాతే తెలుగు అనేపదం వచ్చిందన్నారు మంత్రి. తెలుగు భాష వలనే మనమంతా కలిసి ఉన్నామన్నారు.

మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు

కూడా తెలుగు ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఏ పరిపాలన అయినా పన్నుల బట్టి, ఆదాయాన్ని బట్టి ఉంటుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam