DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవం  

వర్సిటీ కులపతి గవర్నర్ ను అహ్వానించిన వీసీ మొక్కా  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : ఈనెల 24à°µ తేదీన

జరుగనున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ (తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం) స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్

హరిచందన్ ను వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎం. జగన్నాధరావరు అహ్వానించారు. సోమవారం గవర్నర్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమం వివరాలను తెలియచేసారు.

అనంతరం వీసీ జగన్నాధరావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తొలిసారిగా కులపతి (ఛాన్సలర్)  à°¹à±‹à°¦à°¾à°²à±‹   హాజరవుతున్నారని

తెలియచేసారు. à°ˆ నెల  24à°µ తేదీ ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవ భవనంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా పిహెచ్ à°¡à°¿. ఎంఫిల్, ఇతర

పట్టాలను, పతకాలను అందజేస్తారని తెలిపారు. అలాగే అతిథిగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ మరియు పాలక మండలి చైర్మన్ డాక్టర్

కె.సి.రెడ్డి పాల్గొంటారన్నారు. 

ఈ విద్య వేడుకల్లో ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు, అకడమిక్ సభ్యులు, గోదావరి సాధన సమితి సభ్యులు వంటి ప్రముఖులు

పాల్గొంటారని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని అందరూ హాజరై విజయవంతం చేయాలని సూచించారు. దీనిలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.టేకి

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam