DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 3 లక్షలకు అడ్డంగా బుక్కైన భూ తిమింగలం  

రూ. 3 లక్షలకు అడ్డంగా బుక్కైన భూ తిమింగలం  

కృష్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏసీబీ దాడులు 

అనిశా కు అడ్డంగా రెండోసారి బుక్కైన అవినీతి అధికారి

ప్రశాంతి 

లంచగొండి  à°‰à°¦à±à°¯à±‹à°—ులను ఊస్టింగ్ చెయ్యడమే సరైన శిక్ష . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .  .

అమరావతి, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ధనదాహం అధికమై పోవడంతో అవినీతి నిరోధక శాఖకు పని ఒత్తిడి తీవ్రంగా పెరిగి

పోయింది. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఒక అవినీతి తిమింగలం ధనదాహం ఎక్కువై పోయి అడ్డంగా బుక్కవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కృష్ణ జిల్లా కేంద్రమైన మచిలీపట్టణం

కలెక్టర్ కార్యాలయం లోనే పనిచేసే అధికృత అధికారి (భూసంస్కరణలు) పనిచేస్తున్న ప్రశాంతిను వలపన్ని ఏ .సి.బి అధికారులు పట్టుకున్న పట్టుకున్నారు. ఒక వ్యక్తి నుంచి 3

లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. అందరికీ ఆదర్శనంగా ఉండవలసిన కలెక్టర్ కార్యాలయంలోనే అవినీతి అధికారిణి ఒట్టుబడటంతో ఇతర శాఖల అధికారులకు

ముచ్చెమటలు పడుతున్నాయి. 

కృష్ణా జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మెకా రామలింగేశ్వరరెడ్డి కి చెందిన నాలుగు ఎకరాల భూమికి

సంబంధించి లొసుగులు తొలిగించే నిమిత్తం 3 లక్షలు లంచం రామలింగేశ్వరరెడ్డి ని డిమాండ్ చేసినట్లు పిర్యాదు ఏసీబీ కు అందింది. దీంతో  à°à°¸à±€à°¬à±€ అధికారులు ఏ .à°“

భూసంస్కరణలు అధికారిణి దాసరి ప్రశాంతిని  à°°à±†à°¡à± హ్యాండ్డెడ్ à°—à°¾ పట్టుకున్నారు. బేరసారాలు కుదరక భీష్మించుకోవడంతో గతిలేని స్థితిలో రామలింగేశ్వర  à°°à±†à°¡à±à°¡à°¿

పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏ .సి.బి అడిషనల్ ఎస్.పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు.

ప్రస్తుతం అనిశా కు చిక్కిన అవినీతి అధికారిణి

ప్రశాంతి గతంలోనూ ఒకసారి ఏసీబీ à°•à°¿ రెడ్ హ్యాండెడ్గానే చిక్కారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించాలని అని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పడికే అందరినీ హెచ్చరించారు. తదనంతరం అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అవినీతి తిమింగలాలు ఎటువంటి క్షమాపణ

లేకుండా చీడ పురుగుల్ని తొలగించినట్టుగా, విధుల నుంచి బయటకు పంపాలని ఇప్పడికే ఆదేశించడం జరిగింది.  

లంచగొండి ఉద్యోగులను ఊస్టింగ్ చెయ్యాల్సిందే : . .

.

ధనదాహంతో సామాన్యులను జలగల్లా తమ అవినీతి తో పీడించుకు తింటున్న లంచగొండి  à°‰à°¦à±à°¯à±‹à°—ులను శాశ్వతంగా ఊస్టింగ్ చెయ్యడమే సరైన శిక్ష అనిపించుకుంటుంది.

ఉద్యోగాల్లో చేరే సమయంలో నిజాయితీ గా ఉద్యోగం చేస్తామంటూ లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చి కూడా, ఉద్యోగం లో చేరాక జనాన్ని జలగల్లా పీడించుకు తింటున్న ఇలాంటి

వారికి తగిన శిక్షలు సస్పెన్షన్ కాదు.  à°‡à°‚తవరకూ లంచగొండులకు కేవలం రెండు నెలల కాలం సస్పెన్షన్ తో సరిపెట్టడం వలన, వాళ్ళ లో ఎటువంటి మార్పు రావడం లేదు. రెండు నెలల

తర్వాత మళ్ళీ ఉద్యోగం లో చేరుతూ అదే లంచగొండి తనంతో జనాన్ని పీడించుకు తింటున్నారు అన్నది ఎవరూ కాదనలేని నిజం.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ వాళ్లకు శాశ్వతంగా ఉద్యోగం నుంచి బయటకు

పంపడమే సరైన శిక్ష. ఒక్కరిని ఇలా శిక్షిస్తే. . . ఇంకెవ్వరూ లంచాలకు ఆశపడరు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam