DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత దేశ జాతీయ జంతువుగా గోవును ప్రకటించాలి :శివానందలహరి స్వామి 

గో శాలలను రక్షించండి... గో మాతను  à°•à°¾à°ªà°¾à°¡à°‚à°¡à°¿.: 

విశాఖపట్నం, జూన్ 22  2018 ( DNS Online ): సకల దోషాల నివారణకు, ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు పరిష్కారం కల్గించేది గోవు మూత్రం, గోవు

క్షీరం, గోవు నెయ్యి, అని అలాంటి మహత్తర లక్షణాలు తనలోనే ఇముడ్చుకున్న గోమాతను భారత దేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని స్వామి శివానందనలహరి డిమాండ్ చేశారు.

శుక్రవారం విశాఖ నగరం లోని వి జె ఎఫ్ ప్రస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గోమాతను రక్షించడం ద్వారా భారత దేశ ధర్మాన్ని కాపాడవలసిన

భాద్యత అందరిపై ఉందన్నారు. గో మాత రక్షణ కై గత కొన్ని నెలలుగా తాము శిష్య బృందంతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నామన్నారు. తమిళనాడు లోని

తిరువన్నామలై ( భగవాన్ రమణ మహర్షులు కొలువైన ప్రాంతం) లో అన్నపూర్ణ ఆశ్రమం నిర్వహిస్తున్నామని, నిత్యం స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా అన్న

ప్రసాదం అందిస్తున్నామని, గోశాలలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. 

గోశాలలు కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే.  . . 

భారత దేశం లో గోశాలలు అంతరించి

పోతున్నాయని, భారత దేశం లోని ప్రతీ గ్రామం లోనూ గోమాతల రక్షణకై  à°—ోశాలలు ఉండేవని వాటిని ఆయా గ్రామస్తులు, స్తానిక ప్రభుత్వాలు రక్షించేవన్నారు. వీటిని

కాపాడేందుకు దాణా, తదితర వస్తు సామాగ్రి సమకూరేవని, గో క్షీరం, గో నెయ్యి, ఆలయాల్లో వినియోగించేవారన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలం, ప్రజల అలవాట్ల కారణంగా గో

మాతల పరిరక్షణే కరువై, వాటిని భక్షించే దుస్థితికి చేరుకున్నారన్నారు. ఈ విధమైన అనాచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎందరో మహానుభావులు చేసిన పోరాట ఫలితంగా

న్యాయస్థానాలు తీర్పు కూడా ఇచ్చాయన్నారు. ఆవులను హింసించినా, చంపినా కఠిన శిక్షలకు అర్హులవుతారన్నారు. ఆవు జాతి అంతరించింది అంటే అది కచ్చితంగా

పాలకులదేనన్నారు. అతి త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసి గో మాత ను రక్షించేందుకు కృషి చేయాలని కోరనున్నట్టు తెలిపారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam