DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ శాసన మండలి చరిత్రలో నేడు బ్లాక్ డే : మంత్రి బుగ్గన

మండలి చైర్మన్ ను చంద్రబాబు ప్రభావితం చేశారు 

పెద్దల సభలో పైత్య ప్రకోప వేషాలు వేశారు 

నిబంధనలు అమలు చెయ్యడం లో చైర్మన్ తప్పు

చేసారు 

చంద్రబాబు ప్రజా ద్రోహి అనే విషయం తేలిపోయింది 

ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి) : . . . .

అమరావతి, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°†à°‚ధ్ర ప్రదేశ్ శాసన మండలి చరిత్రలో బుధవరాం ( జనవరి 22 ) బ్లాక్ డే అనే ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి

తెలిపారు. మూడు రాజధానుల బిల్లును శాసన సభ మంగళవారమే అమోదించిన విషయం తెలిసిందే. బుధవారం మండలి లో బిల్లు ప్రస్తావన ముగిసిన అనంతరం నిర్ణయాన్ని సెలక్ట్ కమిటీకి

సిఫార్స్ చెయ్యడంతో ప్రభుత్వ పక్షం అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. సభ అనంతరం మంత్రులు మీడియా తో మాట్లాడారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసన మండలి

చర్చని, ఓటింగ్ నిర్వహించవలసి యుండగా, మండలి చైర్మన్ షరీఫ్ ( తెలుగుదేశం పార్టీ సభ్యుడు) ఎటువంటి నిబంధనలూ పాటించకుండా బిల్లును సెలక్ట్ కమిటీ కి సిఫార్స్

చెయ్యడం లో చంద్రబాబు ప్రభావితం చేశారన్నారు. సభ అనంతరం నిబంధనలు అమలు చెయ్యడం లో తప్పు చేసినట్టు చైర్మన్ తెలిపిన విషయాన్నీ ప్రస్తావించారు.  

చంద్రబాబు

ప్రజా ద్రోహి అనే విషయం తేలిపోయిందన్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా శాసన సభా ప్రతిపక్ష నాయకుడు మండలి సమావేశాల సమయంలో ప్రేక్షకుల వేదికపై కూర్చోడం లేదన్నారు.

బుధవారం చంద్రబాబు, సహా, మిగిలిన టిడిపి సభ్యులు, నేతలు నేరుగా గ్యాలరీ లో కూర్చుని చైర్మన్ ను ప్రభావితం చేసారని మండిపడ్డారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam