DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నాటికి ఇంటిస్థలాలు సిద్ధం కావాలి : 

సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం రాష్ట్రంలో

ఉగాది నాటికి ఇంటి స్థలాలు సిద్ధం కావాలని చీఫ్ కమీషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ( సి.సి.ఎల్.ఏ ) నీరబ్ కుమార్ ప్రసాద్ సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం

ఇంటి స్థలాల పంపిణీ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పై సంయుక్త కలెక్టర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు,  సబ్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్

నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటి స్థలాల పంపిణీ పనులు వేగవంతం కావాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో

ఇంకా లేఅవుట్ పనులు పూర్తికాలేదని, వాటిని తక్షణమే పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారులకు సరిపడా స్థలాలు ఇంకా

గుర్తించవలసివస్తే వాటిని తక్షణమే పూర్తిచేయాలని కోరారు. ఇంటి స్థలాలకు  à°¸à°‚బంధించిన లే అవుట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అనంతరం ల్యాండ్

రికార్డ్స్ ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుతూ ల్యాండ్ రికార్డ్స్ పారదర్శకంగా ఉండాలన్నారు. ల్యాండ్ ప్యూరిఫికేషనులో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాలని,

ప్యూరిఫికేషన్ పనులు మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. 
  à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టరు కె.శ్రీనివాసులు,ఇతర అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam