DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వైకాపా నేతల ఆగ్రహం, బాబు దిష్టిబొమ్మ దగ్ధం 

ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు, టిడిపి సభ్యులు: వైకాపా 

విశాఖ ఎమ్మెల్యే లను బయట తిరగనివ్వం : వైకాపా శ్రేణులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం)

: . . . .

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : బుధవారం రాష్ట్ర శాసన మండలి లో మూడు రాజధానుల బిల్లు ను నిబంధనలను భ్రష్టు పట్టించి అక్రమం మార్గంలో  à°…డ్డుకున్నారని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. శాసన సభ ఆమోదించిన బిల్లును ప్రజాస్వామ్యానికి విరుద్దంగా కనీసం సభలో ప్రవేశ పెట్టడానికి కూడా అంగీకరించక

పోవడం తెలుగు దేశం పార్టీ నీచ సంస్కృతి బయట పడిందని నగర అధ్యక్షులు వంశి కృష్ణ శ్రీనివాస్ మండిపడ్డారు. మండలి లో బిల్లు సెలక్ట్ కమిటీ కి సిఫారసీ చేసిన అనంతరం

విశాఖనగరం లోని ఇసుక తోట లో గల జాతీయ రహదారి పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ నిరసనలు

విశాఖలో ఉవ్వెత్తున ఎగిశాయి.    

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం ను రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తే

సమర్ధించవలసిన విశాఖపట్నం ఎమ్మెల్యే లు ( తెలుగుదేశం)  à°† బిల్లును వ్యతిరేకించడం ప్రజా ద్రోహమేనన్నారు. రాజధానిగా సీఎం ఎంపిక చేసిన విశాఖ పట్నం నగరంలో నాలుగు

శాసన సభ స్థానాల్లోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులనే ప్రజలు ఎమ్మెల్యే లుగా ఎన్నుకున్నారన్నారు. అందుకే వీళ్లంతా ప్రజలకు చట్ట సభల సాక్షిగా వెన్నుపోటు

పొడిచారన్నని మండిపడ్డారు. à°ˆ నలుగురు ఎమ్మెల్యే లను ఇక పై విశాఖ రోడ్ల పై తిరగనివ్వమని సైకాపా శృణులు హెచ్చరించాయి. 
ఈ నిరసనల్లో సీనియర్ నాయకులూ కొయ్య ప్రసాద్

రెడ్డి, రవిరెడ్డి పెద్ద సంఖ్యలో యువజన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam