DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోషిని కఠినంగా శిక్షించాలి-రాష్ట్ర మహిళా కమిషన్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  23, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామంలో à°’à°• కుటుంబం పై ప్రేమ ఉన్మాది

జరిపిన దాడి దుర్ఘటనలో మృత్యువాత పడిన కుటుంబీకుల పిల్లలుకు సంబంధించి కాలి గాయపడి రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న ఇద్దరు

బాలురు ను గురువారం నాడు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి పరామర్శించారు. సంఘటనపై కుటుంబీకుల బంధువులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ

సందర్భంగా ఆమెను కలిసిన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా

ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఉన్మాది నీ కఠినంగా శిక్షించ వలసిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ తో సంప్రదించి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

నేర విభాగం డీఎస్పీ తో మాట్లాడగా దోషిని పట్టుకునేందుకు మూడు టీములు రంగంలో ఉన్నాయని తెలిపారనీ చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు జిల్లా

కలెక్టర్ వారితో సంప్రదిస్తామని అన్నారు. మహిళా కమిషన్ ఐ సి డి ఎస్ ద్వారా ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీరుస్తామని పిల్లలను చదివిస్తామని తెలిపారు.

ప్రస్తుతం పిల్లలకు ప్రాణాపాయం లేదని అన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు తో ఆసుపత్రి మెడికల్ సూపర్ఎం డెంట్ జి సోము సుందర్ రావు ఐసిడిఎస్ సిడిపిఓ లు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam