DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంట విక్రయ సమస్యలు పరిష్కరించండి.

పౌర సరఫరాల శాఖకు à°Žà°à°•à±†à°Žà°¸à±‌ వినతి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  23, 2020 (డిఎన్‌ఎస్‌) : రైతులు వరి పంట అమ్ముకోవడానికి సమ స్యలు

ఎదుర్కొంటున్నారని, పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల రైతు సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని à°† శాఖ à°Žà°‚à°¡à°¿à°•à°¿ ఎపి రైతు సంఘం (ఎఐకెఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన

కార్యదర్శులు వై.కేశవరావు, పెద్దిరెడ్డి మంగళ వారం వినతి పత్రం అందజేశారు. 60 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ ప్రకటించినా ఆచరణలో ఇప్పటికి 24 లక్షల

టన్నులు మాత్రమే కొన్నారని తెలిపారు. సన్న రకాలు మాత్రమే కొంటున్నారని, అన్ని రకాలు కొనేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయ నగరం జిల్లాలో 3.6 లక్షల టన్నుల

ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.2 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని తెలిపారు. తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల

ద్వారా కొనకుండా ప్రయివేటు మిల్లర్లు, వారి ఏజెంట్ల ద్వారా కొంటున్నారని పేర్కొన్నారు. 85 కిలోల బస్తాకు రూ.1560 మద్దతు ధర ఉంటే రైతులకు రూ.1350 మాత్రమే

చెల్లిస్తున్నారన్నారు. కష్ణా జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో à°ˆ క్రాప్‌ బుకింగ్‌ లేదని, పట్టాదారు పాసుపుస్తకాలు లేవని అభ్యంతరాలు పెడుతున్నారని తెలిపారు.

గుడివాడ డివిజన్‌లో ధాన్యం పాడైందని 75 కిలోల బస్తా రూ.ఏడు వందలకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కర్నూలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను

సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో సుమారు రూ.వంద నుండి

రూ.రెండొందల నష్టానికి రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటుంటున్నారని తెలిపారు. పౌర సరఫరాల శాఖ జోక్యం చేసుకొని కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు

పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam