DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రాజధానులు వద్దని మొత్తుకుంటున్న తెలియడం లేదు:

పెద్దల సభలోనే పెద్దలకి ఘోర అవమానం. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపాటు  

ఏ 2, వైవీ సుబ్బారెడ్డి గ్యాలేరీలో ఎందుకు ఉన్నారు ? 

(DNS రిపోర్ట్ :

పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . . 

అమరావతి, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆర్ధికంగా వెనుకంజలో ఉన్న 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు వద్దని à°…à°‚à°¤

మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి అర్ధం కావడం లేదని తెలుగుదేశం పార్టీ  à°…ధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించిన అత్యంత కీలమైన బిల్లు పై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం లేదా, సభ్యులను బయటకు పంపమని సీఎం ఎలా

అదేశాలు ఇస్తారని ప్రశ్నించారు. చట్ట సభలో తీర్మానం పెట్టకుండా సభ్యులను ఎలా బయటకు పంపుతారు? అయినా, ప్రజల కోసం, ప్రజల డబ్బులతో జరుగుతున్నా చర్చలను ప్రజలకు

తెలియకుండా, ప్రత్యక్ష ప్రసారాలను ఎలా నిలిపేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీసం సభ ఆవరణలో ఉన్న చాంబర్స్ లో కూడా టీవీ లలో కౌన్సిల్ సమావేశాలు ఇవ్వలేదు.

మండలి చైర్మన్ స్వయం à°—à°¾ అడిగినా కౌన్సిల్  à°²à±ˆà°µà± ఇవ్వలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇంతగా అరాచక పాలన లేదన్నారు. 

రాజకీయ

ప్రత్యర్థులమైనా, తనకు  à°µà±ˆà°Žà°¸à± ఆర్ గౌరవం ఇచ్చేవారన్నారు. మండలి చైర్మన్ రూమ్ లోనే 22 మంత్రులు కాపురం పెట్టారు. రెండు రోజులు వత్తిడి పెట్టి ఎమ్మెల్సీ లపై ప్రలోభాలు

పెట్టారన్నారు. తీవ్రవాద గ్రూప్ లనుంచి తీసుకు వచ్చి సీతక్క, పోతుల సునీతకు అవకాశం ఇచ్చాము. పోతుల సునీతకు మేము ఏమి తక్కువ చేసాము? పోతుల సునీతకు రెండు సార్లు

ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాము....ఓడితే ఎమ్మెల్సీ ని చేసామన్నారు. మెజారిటీ ఉందని మాకు ముందు రోజే ప్రూవ్ అయ్యింది. తొమ్మిది మంది సభ్యులతో గెలుస్తామని అధికార పార్టీ

సభ్యులు ఎలా అనుకున్నారు!?

వీళ్ళ అరాచక పాలనలో పెద్దలకు గౌరవం ఇవ్వడం కూడా తెలియడం లేదన్నారు. పెద్దల సభ ( శాసన మండలి) లో పెద్దగా ఉన్న చైర్మన్ షరీఫ్ ను మంత్రి

నేరుగా సాయిబుకే పుట్టవా అని దూషిస్తారా ? అని మంత్రులపై మండిపడ్డారు. శాసన సభలో లోని తమ ఛాంబర్ లో టీవీ లో లైవ్ రావడం లేదని తానూ గ్యాలరీ కి వెళ్లడం జరిగిందన్నారు.

మండలి గ్యాలరీ లో నా మొబైల్ అడిగారూ...ఇచ్చేసాను. వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ ఫోన్ లతో గ్యాలరీ కి ఎలా వచ్చారు...ఫోటోలు ఎలా దిగారు. అని ప్రశ్నించారు.

సభలో బజారు

రౌడీల కంటే ఘోరం à°—à°¾ వైసీపీ సభ్యులు ప్రవర్తించారని,  à°µà±ˆà°¸à±€à°ªà±€ సభ్యులు ఉన్మాదులా....దున్న పోతులా? అని ప్రశ్నించారు.  à°®à°‚డలి పై శాసన సభలో చర్చ కూడా చేపట్ట కూడదని

తెలిపారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ నీచమైన రాజకీయాలకు పాల్పడిందని, స్పీకర్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి... ప్రతిపక్షాన్ని సభ నుండి బయటకు నెట్టామన్నారు. ఏది చెయ్యకూడదో

సభలో అదే చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గంగా ప్రవర్తించారని, లైవ్ లు కట్ చేసి టీవీ ప్రసారాలు ఎందుకు నిలిపివేసారు, ఏ 2, వైవీ సుబ్బారెడ్డి గ్యాలేరీలో

ఎందుకు కూర్చున్నారు చెప్పాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam