DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటు నమోదు ప్రతి ఒక్కరి భాద్యత: జిల్లా కలక్టర్ 

విద్యార్థులే ప్రచార చైతన్య వారధులు: ఎయు వీసీ  

జాతీయ ఓటరు నమోదు దినోత్సవం అవగాహనా సదస్సు . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . ..

విశాఖపట్నం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : విద్యార్థులే ప్రచార చైతన్య వారధులు అని ఆంధ్ర  à°µà°¿à°¶à±à°µà°•à°³à°¾à°ªà°°à°¿à°·à°¤à± ఉప కులపతి ఇంచార్జి డాక్టర్ పి వి సి à°¡à°¿ ప్రసాద్ రెడ్డి

తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలను విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చిల్డ్రన్ ఎరీనా లో  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ నిర్వహించారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

హాజరైన ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ఈ నమోదుకు పలు మార్గాలు

అందుబాటులో ఉన్నాయన్నారు ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా పోస్ట్ ఆఫీస్ స్థానిక గ్రామపంచాయతీ మండల రెవెన్యూ కార్యాలయం గాని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద

ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాలలో ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అన్నారు అదేవిధంగా ప్రతి విద్యాలయం లోనూ కళాశాలలోనూ ఈ నమోదు ప్రక్రియకు అవగాహన సదస్సు

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గా 1950 జనవరి 25న ఈ ఎన్నికల సంఘం ఏర్పడింది అన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని

జిల్లా మండల కేంద్రాల్లోనూ ఓటరు దినోత్సవ అ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2011 నుంచి ఈ అవగాహనా సదస్సును క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాతీయ

నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా అభివర్ణించారు ఈ దేశంలో మొట్టమొదటి ఓటు హక్కు

ఉపయోగించుకున్నవారు శ్యామ్ శరణ్ నేగి (గత ఎన్నికల్లోనూ ఈయన ఓటు హక్కు వినియోగించుకున్నారు) అనే ఆయన ఒక ఉపాధ్యాయుడు కావడం ఆనందకరం అన్నారు. ఈయన హిమాచల్ ప్రదేశ్

కు చెందినవారన్నారు. అదే సందర్భాన్ని పురస్కరించుకొని తాను అధ్యాపకుడు అయినందున ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆయన బృందం

ఆహ్వానించినట్టు భావిస్తున్నట్టు తెలిపారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్క విద్యార్థి ఇళ్లలోని కుటుంబ సభ్యులందరికీ ఓటు హక్కు విలువను తెలియజేసి ఓటు వేయ వలసిన బాధ్యతను గుర్తు

చేయాలన్నారు రానున్న కాలంలో ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులు ఉన్నారు మొట్టమొదటిసారిగా ఒకేసారి 10 లక్షల ప్రదేశాల్లో జాతీయ ఓటరు దినోత్సవ

అవగాహన సదస్సు నిర్వహించుకోవడం భారతదేశానికి దక్కిందన్నారు. ఇదే సమయానికి భారత రాష్ట్రపతి కూడా దేశ రాజధానిలో ఒక అవగాహనా సదస్సులో పాల్గొనడం ప్రతి ఒక్కరికీ

స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.  

ఓటు నమోదు ప్రతి ఒక్కరి భాద్యత: జిల్లా కలక్టర్ . . . .

ఓటు నమోదు చేయించుకోవడం ప్రతి ఒక్క పౌరుని భాద్యత అని విశాఖ జిల్లా

కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ కళాశాలలోనూ కార్యాలయాల్లోనూ ప్రభుత్వ

రంగ ప్రైవేటు రంగ సంస్థలలోనూ ఓటరు దినోత్సవ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు జిల్లాస్థాయిలో ఏ ఒక్క అర్హత కలిగిన పౌరుడు ఓటు హక్కు నమోదు కాకుండా

ఉండకూడదని సంకల్పంతో జిల్లా యంత్రాంగం సంపూర్ణ కృషి చేస్తోంది అన్నారు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు గ్రామ గ్రామాన తిరుగుతూ స్థానికులకు ఓటు హక్కు

దాని విలువ ప్రజల బాధ్యత అతను తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డి ఆర్ ఓ శ్రీదేవి, వివిధ పాఠశాలలు,

కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam