DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి : కృష్ణబాబు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో

ఎదురయ్యే అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తుందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి  à°Žà°‚ à°Ÿà°¿ కృష్ణ బాబు తెలిపారు. శనివారం నాడు స్థానిక కలెక్టర్

కార్యాలయంలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టరు వి వినయ్ చంద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.  à°ˆ సందర్భంగా మాట్లాడుతూ  à°•à°¾à°°à±à°¯à°¾à°šà°°à°£ ప్రణాళిక ప్రకారం

 à°¨à°¿à°°à±à°¦à°¿à°·à±à°Ÿ కాల వ్యవధిలో పనులను పూర్తి చేయాలని ఆయన ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను కోరారు. రహదారి నిర్మాణానికి అవసరమైన à°•à°‚à°•à°°, ఇసుక ఇతర మౌలిక సదుపాయాలు

కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. జాతీయ రహదారి  16 లో ఆనందపురం - అనకాపల్లి  à°µà°¿à°­à°¾à°—ంలో 50 కిలోమీటర్ల కు గాను, 18 కిలోమీటర్ల

పనులు పూర్తయినాయని తెలిపారు. à°ˆ ప్రాజెక్టుకు 330 హెక్టార్ల భూమి అవసరం కాగా, అందులో  190 హెక్టార్లు ప్రైవేట్ భూములు ఉన్నాయని,  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ 178  à°¹à±†à°•à±à°Ÿà°¾à°°à±à°² భూమి సేకరణకు

అవార్డులు పాస్ చేయడం జరిగిందని తెలిపారు. నష్టపరిహారంగా రూ.547 కోట్లు డిపాజిట్ చేయగా, రూ.378 కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు. మొత్తం 292 హెక్టార్ల భూమి

ప్రాజెక్టుకు అందుబాటులో ఉందని తెలిపారు.

అనంతరం సబ్బవరం నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి  à°ªà°¨à±à°²à°¨à± సమీక్షించారు. à°ˆ

ప్రాజెక్టుకు 76  à°¹à±†à°•à±à°Ÿà°¾à°°à±à°² భూమి ఆవశ్యకత ఉందని,  à°…ందులో 43 హెక్టార్ల ప్రైవేట్ భూమి సేకరించవలసి ఉండగా,  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à± 40 హెక్టార్ల భూమికి సంబంధించి అవార్డు పాస్

చేయడం జరిగిందని తెలిపారు. నష్టపరిహారంగా  à°°à±‚. 172 కోట్లు చెల్లించవలసి ఉండగా, ఇప్పటికే రూ.100 కోట్లు డిపాజిట్ చేసి, అందులో రూ.97 కోట్లు వితరణ చేయడం జరిగిందని తెలిపారు.

త్వరలో మిగిలిన వారికి కూడా చెల్లించడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం జాతీయ రహదారుల

నిర్మాణ పనుల పురోగతిపై అత్యంత శ్రద్ధ వహించి వివిధ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నదని తెలిపారు.

 à°ˆ కార్యక్రమంలో

జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సూర్య కళ, జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. శివ శంకర్, డీజీఎం ఎన్. హరికృష్ణ,

డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam