DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో జండా తిరగేసి ఎగరేసిన మంత్రి అవంతి. . .

పార్టీ కార్యాలయం సాక్షిగా జండాకు అవమానం, 

సోషల్ మీడియా లో సంచలనం à°—à°¾ జరుగుతున్న ప్రచారం 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం ): . .

.

విశాఖపట్నం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : దేశ వ్యాప్తంగా జరుగుగున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ నగరంలోని అధికార పార్టీ కార్యాలయం లోనూ వేడుకలు

వైభవంగా జరిగాయి. అయితే ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, క్రీడలు యువజనోత్సవాల శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు  à°œà°¾à°¤à±€à°¯ జండా తిరగేసి ఎగరేశారు.

ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో జాతీయ రహదారికి అతి సమీపంలోని మద్దిల పాలెం లో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో ఆయన జాతీయ జండాను ఎగుర వెయ్యడం, ఆపై

వందనం చెయ్యడం, తదుపరి జాతీయ గీతం పాడడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి అయన పార్టీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం లో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు

శ్రీనివాస్, మహిళా నేత కళ్యాణి, ఇతర పార్టీ కార్యవర్గ రాష్ట్ర స్తాయి నేతలు పెద్ద సంఖ్యా లో పాల్గొన్నారు. వీళ్లేవ్వరూ కూడా జాతీయ జండాను తిరగేసి ఎగరేశారు అనే

విషయం గమనించక పోవడం విశేషం. అనంతరం రహదారిని వెళ్లే వారు ఒకరు చూసి, పార్టీ నేతకు ఒకరికి చెప్పడం తో జండాను క్రిందకు దింపి తిరిగి మళ్ళీ ఎగుర వేశారు. ఈ లోగా

మరొకసారి మంత్రిని పిలిచి, సెల్యూట్ చేయించి ఫోటోలు తీసి మీడియా కు పంపారు.  à°¤à°¾à°®à± సరిగ్గానే జండా ఎగురవేశాం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగానే జరగరాని తప్పిదం

జరిగిపోయింది. మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చిన దగ్గర నుంచి, జండా  à°¤à°¿à°°à°—ేసి ఎగుర వెయ్యడం, వందనం చెయ్యడం, మళ్ళీ పార్టీ నేతలు జండాను దింపి సరిదిద్దడం అంతా వీడియో

లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పెట్టేసారు. à°ˆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. 

కోసం మెరుపు: మంత్రి అవంతి ఆధ్వర్యవంలో ఎన్నో విద్య సంస్థలు

నడుస్తున్నాయి. ఈయన ఎన్నో మార్లు జాతీయ జండా ఎగురవేశారు. అయినప్పటికీ జండాను ఎలా ఎగురవేసారో చూసుకోక పోవడం విశేషం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam