DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వాసులకు వాసుపల్లి క్షమాపణ చెప్పాలి : రెహ్మాన్

అమరావతి రాజధానిగా ఎన్నికల్లోకి వెళ్ళండి 

వాసుపల్లికి మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సవాల్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,

జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : రానున్నగ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ ) ఎన్నికల్లో అమరావతే రాజధాని అనే నినాదంతో పోటీ చేయాలనీ తెలుగుదేశం పార్టీ

నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ కు  à°®à°¾à°œà±€ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ రెహమాన్ సవాల్ విసిరారు. మంగళవారం నగరం లోని à°“ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో

ఆయన మాట్లాడుతూ కేవలం స్వార్ధ పూరిత రాజకీయాల కోసం ప్రజలను తప్పు దారి పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాల్లోని భూముల్లో తన కోటరీ అదుపులో

పెట్టుకుని, పార్టీ క్యాడర్ ను రంగ్ ట్రాక్ పట్టిస్తున్నారన్నారు. ఈ క్రమం లోనే విశాఖపట్నం టిడిపి నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

అమరావతిని రేసు కారుతోను . . . విశాఖను ఎడ్లబండితోను పోల్చిన కారణంగా తక్షణం విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాడిదలు, లొట్టిపిట్టలతో పిచ్చి

ఉద్యమాలు చేయటం మానాలన్న ఆయన ఎవరివి పిచ్చి ఉద్యమాల్లో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విశాఖ రాజధానిగా 1953 లో అప్పటి నేతలు చట్ట తీర్మానం చేశారని గుర్తు చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి, విశాఖ రాజధానికి అడ్డుతగులుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ద్రోహులను ఈ ప్రాంత

ప్రజలు క్షమించరని తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam