DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి సూర్య దేవాలయంలో రథ సప్తమి ఏర్పాట్లపై సమీక్ష  

సామాన్య భక్తుల దర్శనమే ప్రాధాన్యత : ఆర్ à°¡à°¿ à°“ రమణ 

 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). .

శ్రీకాకుళం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) :

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథ సప్తమి ఉత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనానికి అత్యంత ప్రాధానాత్యను ఇస్తున్నామని రెవిన్యూ డివిజనల్ అధికారి

ఎం.వి.రమణ అన్నారు. రథ సప్తమి ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించుకుంటున్నప్పటికి జనవరి 31వ తేదీ అర్థ రాత్రి నుండి రథసప్తమి వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. మాఘ మాసం

రెండవ ఆది వారం సైతం మరుచటి రోజున పడటంతో ఆది వారం కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  à°°à°¥ సప్తమి ఏర్పాట్లపై అరసవల్లి

సూర్యానారయణ స్వామి వారి దేవస్ధానంలో మంగళ వారం వివిధ శాఖలతో సమన్వయ కమిటి సమావేశం ఆర్.డి.ఓ అధ్యక్షత జరిగింది. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా చక్కటి దర్శనం

చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్.డి.ఓ చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎటువంటి లోపం లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి

భక్తుడు దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకుని సంతృప్తిగా బయటకు వెళ్ళాలని చెప్పారు. ఉచిత క్యూ లైన్లు అరసవల్లి తోటల నుండి ప్రారంభమై ఇంద్ర పుష్కరిణి గుండా గుడిలోకి

ప్రవేశిస్తుందని చెప్పారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు కంపార్టుమెంట్లను ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. అరసవల్లి ఆలయ ఆర్చ్ నుండి వంద, ఐదు వందల రూపాయల క్యూ

లైన్లు, వి.ఐ.పి, దాతల క్యూ లైన్లు ఉంటాయని చెప్పారు. వంద, ఐదు వందల రూపాయల దర్శనానికి క్యూ లైన్లలోనే టికెట్లను విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మత్స్యశాఖ,

అగ్నిమాపక శాఖ సమన్వయంతో పనిచేసి ఇంద్ర పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లను పెట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో జెమ్స్ ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రి వైద్య

సేవలు అందించే ఇతర సంస్ధలు వైద్య శిబిరాలను, అంబులెన్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలతోపాటు, ప్రాధమిక వైద్య సేవలను అందించుటకు వైద్య

శిబిరాలను చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తాగు నీరు, పారిశుధ్య వ్యవహారాలను నగర పాలక సంస్ధ సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. తాగు నీరు, పాలు, మజ్జిగ, ఆహారం

ఏర్పాట్లు చేయుటకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్ధలను సమన్వయ పరచి వివిధ ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇపిడిసిఎల్ నిరంతర

విద్యుత్ ను అందించాలని ఆయన సూచించారు. ఇంద్ర పుష్కరిణిలో మంచి నీటిని నింపాలని అందుకు తగిన ఏర్పాట్లను జలవనరుల శాఖ చేపట్టాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను

సూచించారు. అన్ని శాఖలు ప్రతి క్షణం జాగరూకతతో ఉండాలని ఆయన అన్నారు. రథ సప్తమి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని, భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకోవాలని

పేర్కొన్నారు. రథ సప్తమికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి ఆర్.టి.సి బస్సులను

నడుపుతుందని చెప్పారు. 80 అడుగుల రహదారిలో పార్కింగు ఏర్పాట్లు చేయడంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  à°ˆ సందర్భంగా క్యూ లైన్ల

ఏర్పాటు, తదితర విషయాలను పరిశీలించారు.  
    à°ªà±‹à°²à±€à°¸à± ఇన్ స్పెక్టర్ బి.లలిత మాట్లాడుతూ 13 వందల మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
     à°ˆ

సమావేశంలో దేవదాయ శాఖ సహాయ కమీషనర్ వై.భద్రాజి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.హరిసూర్యప్రకాష్, సహాయ ఎక్సైజ్ సూపరింటిండెంట్ డా.కె.ఎస్.రాంబాబు, ఇన్స్పైక్టర్

ఎం.శ్రీనివాస రావు, నగరపాలక సంస్ధ ఆరోగ్య అధికారి వెంకట రావు, తహశీల్దారు ఐ.టి.కుమార్, ఏపిజివిబి ప్రాంతీయ మేనేజర్ గురునాథ రావు, ప్రజా రవాణా శాఖ పి.ఆర్.ఓ

బి.పి.ఎల్.రావు, మత్య్యశాఖ అభివృద్ధి అధికారి గోపి, జెమ్స్ ప్రతినిధి రామ్మోహన రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam