DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి నుండి ఇంటి వద్దకే పింఛన్లు : సీఎం జగన్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : వచ్చే నెల నుండి లబ్ధిదారులకు వార్డు వాలంటీర్ à°² ద్వారా పింఛన్లు, ఇతర సేవలను

ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు పోలీస్ కమిషనర్ సూపరిండెంట్ లతో వీడియో

కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్పందన, వైఎస్సార్ పెన్షన్, పేదలందరికీ ఇల్లు, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా కేంద్రాలు, వార్డు గ్రామ సచివాలయాలు, వైయస్సార్ కంటి

వెలుగు, జగనన్న అమ్మ ఒడి, ఇంటి వద్దకే ఇసుక, దిశా చట్టo పథకాల పై సమీక్ష నిర్వహించారు.

స్పందన లో దరఖాస్తు చేసుకున్న వారు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా వారికి

సమాధానం ఇవ్వాలని సూచించారు. ఫిబ్రవరి నెల నుండి 54 లక్షల 64 వేల 177 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులను

అందిస్తామన్నారు. సోషల్ ఆడిట్ లో ప్రదర్శించిన 15 లక్షల మందితో కోటి 42 లక్షల బియ్యం కార్డులు ఉంటాయన్నారు. వాలంటీర్ల ద్వారా 541  à°¸à±‡à°µà°²à± ఇంటింటికి అందుతాయన్నారు. ఉగాది

నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలను సిద్ధం చేయాలన్నారు. వార్డు గ్రామ సచివాలయలకు అన్ని వసతులు కల్పించి పూర్తి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని

ఆదేశించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాబూజీ, సంయుక్త కలెక్టర్ లు ఎల్. శివ

శంకర్, ఎం. వేణుగోపాలరెడ్డి, డిఆర్ఓ ఎం. శ్రీదేవి, డిఆర్డిఏ పి.డి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈవో నాగార్జున, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. గోవిందరావు,

వ్యవసాయశాఖ జె.à°¡à°¿. లీలావతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తిరుపతి రావు, సి.పి.à°“.  à°°à°¾à°®à°¾à°°à°¾à°µà±, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam