DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడ్కో 12 వ విడత రివర్స్ టెండర్లలో రూ. 30.91 కోట్లు ఆదా

63 వేల 744 ఇళ్లకు పూర్తయిన రివర్స్ టెండరింగ్

మొత్తం రూ.392.23 కోట్ల మేర ప్రయోజనం

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

కరస్పాండెంట్ అమరావతి) : . . . . 

అమరావతి, జనవరి  29, 2020 (డిఎన్‌ఎస్‌) : పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్

ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్ల మేర ప్రజా ధనాన్ని ఆదా చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం

జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డిఇసి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ రూ.రూ.275.7 కోట్ల ఈ పనులను

చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచింది. ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గింది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్

మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కో లో సత్ఫలితాలు సాధించామని

 à°®à°‚త్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
ఇంతవరకు  à°®à±Šà°¤à±à°¤à°‚ 12 విడతల్లో 63,744 ఇళ్లు/ యూనిట్ల నిర్మాణానికి సంబంధించి రూ. 3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్

ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజా ధనం

ఆదా అయ్యిందని ఆయన వివరించారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156  à°¨à±à°‚à°šà°¿ రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు. వీలైనంత

త్వరగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam